| జొక్కనృపాలుఁ డుగ్రుఁ డయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్ | |
యని చెప్పినట్లు వదంతి కలదు. దీనింబట్టి యతఁడు సాహిణిమారునికాలమునం దుండవలయు నని తెలియుచున్నది. దీనిచేత నితనితోఁ బాటిగా స్తుతులం గానిపించుభాస్కరుడు, సాహిణిమారుని కాలమువాఁ డగుహళక్కిభాస్కరుఁడె కావలయును. మఱియు భీమకవి రాయకళింగగంగును గూర్చి,
| 'వేములవాడ భీమకవి వేగమ చూచి కళింగగంగు తా | |
అని శాప మిచ్చినట్లును నా చొప్పుననే కళింగగంగు పరులచే రాజ్యము పోఁగొట్టుకొని దీనుఁడై యుండఁగా మరల భీమకవి యతనిని జూచి
| 'వేయిగజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో | |
అని యాశీర్వదించినట్లు చాటువులు కనుపట్టుచున్నవి. ఇందు 'రాయల గెల్చి' యనుటచే నా రాయలే కళింగగంగును జయించియుండె నని తెలియుచున్నది. ఈరాయలు, శ్రీనాథుఁడు 'చంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమబిరుద' మని చెప్పిన రాయలే కావలయును. శ్రీనాథునకుఁ గవిసార్వభౌమబిరుద మిచ్చినయాంధ్రరాయలే యితఁ డగును. ఎట్లన భీమకవి,
| 'ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం | |
అని తెలుంగాధీశుని – అనఁగా ఆంధ్రరాయలను గస్తూరికాదులం దెమ్మని యన్నాఁడు, శ్రీనాథుఁడు నీ తెలుంగురాయలనే
| 'అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా | |
అని కస్తూరికాదానము సేయు మన్నాఁడు. మఱియు నీకవియే 'రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు' నని కస్తురి