పుట:భాస్కరరామాయణము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జొక్కనృపాలుఁ డుగ్రుఁ డయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్
మిక్కిలి రాజశేఖరునిమీఁదికి వచ్చిన రిత్తవోవునే.

యని చెప్పినట్లు వదంతి కలదు. దీనింబట్టి యతఁడు సాహిణిమారునికాలమునం దుండవలయు నని తెలియుచున్నది. దీనిచేత నితనితోఁ బాటిగా స్తుతులం గానిపించుభాస్కరుడు, సాహిణిమారుని కాలమువాఁ డగుహళక్కిభాస్కరుఁడె కావలయును. మఱియు భీమకవి రాయకళింగగంగును గూర్చి,

'వేములవాడ భీమకవి వేగమ చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ముపొ మ్మనెన్
మోమును జూడ దోష మిఁక ముప్పదిరెండుదినంబులోపలన్
జామున కర్ధమం దతనిసంపద శత్రులఁ జేరుఁ గావుతన్.'

అని శాప మిచ్చినట్లును నా చొప్పుననే కళింగగంగు పరులచే రాజ్యము పోఁగొట్టుకొని దీనుఁడై యుండఁగా మరల భీమకవి యతనిని జూచి

'వేయిగజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో
రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకో వడిన్
రాయకళింగగంగుఁ గవిరాజు భయంకరమూర్తి చూడఁ దా
బోయిన మీనమాసమునఁ బున్నము పోయిన షష్ఠి నాఁటికిన్'

అని యాశీర్వదించినట్లు చాటువులు కనుపట్టుచున్నవి. ఇందు 'రాయల గెల్చి' యనుటచే నా రాయలే కళింగగంగును జయించియుండె నని తెలియుచున్నది. ఈరాయలు, శ్రీనాథుఁడు 'చంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమబిరుద' మని చెప్పిన రాయలే కావలయును. శ్రీనాథునకుఁ గవిసార్వభౌమబిరుద మిచ్చినయాంధ్రరాయలే యితఁ డగును. ఎట్లన భీమకవి,

'ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం
దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుండ భీ
మన నాపేరు వినంగఁ జెప్పితిఁ దెలుంగాధీశ కస్తూరికా
ఘనసారాదిసుంగధవస్తువులు వేగం దెచ్చి లాలింపురా.'

అని తెలుంగాధీశుని – అనఁగా ఆంధ్రరాయలను గస్తూరికాదులం దెమ్మని యన్నాఁడు, శ్రీనాథుఁడు నీ తెలుంగురాయలనే

'అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిదానము సేయరా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
దాక్షారామపురీవిహార వరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.'

అని కస్తూరికాదానము సేయు మన్నాఁడు. మఱియు నీకవియే 'రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు' నని కస్తురి