పుట:భాస్కరరామాయణము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఉన్నయెడ లక్ష్మణుం డది, క్రన్ననఁ బరికించి కేలఁ గైకొని యట య
త్యున్నతతరువులు వేయఁ బ్ర, సన్నానను లగుచు మౌనిసత్తము లెలమిన్.

119


తే.

ఓ మహారాజపుత్ర నీ కుచిత మగునె, పూచి కాచి తనర్చిన భూరుహముల
వ్రేయఁ బూనెదు వలవ దవ్వెదురుపొదను, నొక్కవేటున నఱకు మత్యుగ్రగతిని.

120


వ.

అని మునీంద్రులు సెప్పిన సుమిత్రానందనుండు తనకరంబున నున్న నూతనచం
గ్రహాసంబు జళిపించి ప్రచండబాహుదండం బెత్తి యవ్వెదురుపొద నొక్కవ్రేటు
నం బడ నఱకిన నచ్చటిమునీంద్రులు సంతసంబునం గొనియాడి రందుఁ దెగిన
రక్షోవీరుని వీక్షించి లక్ష్మణుండు మహాతాపసోత్తముం జంపి పాపంబుఁ గట్టికొం
టి నింక భూపాలున కెఱింగింపవలయు ననుచు భయంబున ఫలంబులు గొంచు
నత్యంతచింతాక్రాంతస్వాంతుం డై యమ్మహీకాంతుపాలికిం బోయి తచ్చరణార
విందంబులకు వందనం బాచరించిన నక్కుమారు నెత్తి కౌఁగిటం జేర్చి నీ వతి
ఖిన్నుండ వై విన్నంబోయి యున్నవిధం బే మన్న నయ్యన్నకు నున్నతెఱం గె
ఱుంగం జెప్పిన రామచంద్రుండు కటకటంబడి యిమ్మహాఘోరపాతకం బేరూ
పంబునం బాయునో యని విచారించుచున్న సమయంబున.

121


తే.

మునులు రఘురాముఁ గానవచ్చిన విభుండు
నమ్మహాత్ముల కెదు రేఁగి యధికభక్తిఁ
బుడమిఁ జాఁగిలి మ్రొక్కి సంపుటకరాబ్జుఁ
డగుచు వినయంబు దోఁప ని ట్లనియెఁ బ్రీతి.

122


వ.

మహాత్ములారా మాసౌమిత్రి యెఱుంగమి నొక్కమునివరుం జంపె మీయనుగ్ర
హంబున నిమ్మహాపాపం బితనిం బొందకుండునట్లు చేసి రక్షించి యతనిప్రాణం
బు లొసంగుం డని ప్రార్థించిన వారలు మందస్మితవదనారవిందు లై రఘునంద
నున కి ట్లనిరి.

123


తే.

మిహిరకులనాథ యివుడు సౌమిత్రిచేతఁ
ద్రుంగినాతఁడు తాపసేంద్రుండు గాఁడు
దనుజవరవీరుఁ డతనివృత్తాంత మెల్ల
నెఱుఁగఁ జెప్పెద మని రాఘ వేంద్రుఁ జూచి.

124


వ.

విద్యుజ్జిహ్వనందనుం డగుజంబుకుమారుండు తండ్రిపగ తీర్చుటకు నై యాఖండ
లుం గూర్చి యఖండితతపంబు సలుపుచున్న నత్తపంబునకు మెచ్చి యింద్రాదు
లు సాంద్రద్యుతిభాసురం బగుచంద్రహాసం బంపిన నవ్వీరుండు మదీయతపోబ
లంబున కిది యేటికిం బనిచి రని యొల్లకున్న నల్లన గగనంబున మెలంగుచున్న
దాని నీరాజనందనుఁ డందికొని జళిపించి ఫలవృక్షంబుల వ్రేయ సమకట్టిన నేము
వల దని యవ్వెదురుగుమి సూపినం బడవేసె నావ్రేటున నారాక్షనుండు దెగిన
లక్ష్మణకుమారుండు చూచి యాకులితమానసుం డై మీకడ కేఁగుదెంచినవాఁ