పుట:భాస్కరరామాయణము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ నేటి కరుగుదెంచుఁ గా కనుచుఁ బలుక నమ్మునిశిష్యుండును మగిడి వచ్చి సౌ
మిత్రిం బురస్కరించుకొని చనుదెంచురామచంద్రం గనుంగొని.

91


క.

జననాయక మిమ్ముం దో, కొని ర మ్మని మమ్ముఁ బనిచెఁ గుంభజుఁ డింకం
జనుదెం డనుడుఁ దదాశ్రమ, వనముఁ బ్రవేశించి యద్దివాకరతేజున్.

92


క.

కని యప్పుడు కౌసల్యా, తనయుఁడు సౌమిత్రితోడఁ దత్సామర్థ్యం
బనురక్తిం గొనియాడుచుఁ, జని యాసంయమివరేణ్యుచరణంబులకున్.

93


వ.

నమస్కారంబు సేయుటయు నమ్మహాభాగుండు నాశీర్వదించుచు నక్కుమారుల
నెత్తి కౌఁగిటం జేర్చి మూర్ధఘ్రాణంబు నొనరించి పురోభాగంబునం బ్రణత
యైనసీతాదేవి నభినందించి యమ్మువ్వుర నుచితప్రకారంబులఁ గూర్చుండ నియో
గించి కుశలం బడిగి ముదితహృదయుం డగుచు నిజశిష్యునిం గనుంగొని.

94


క.

సురవరులకంటెఁ బూజ్యుం, డరయఁగ నీపురుషవృషభుఁ డ ట్లగుట గుణో
తరులకు నీహవి వేల్చిన, చరుశేషముఁ దెచ్చి పెట్టు సంభావనతోన్.

95


క.

విను మతిథిగృహంబునకుం జనుదెంచినఁ దనకు దొరకు శక్తిం బూజిం
పనిదుర్మతి నిజమాంసా, శనుఁ డగుఁ బరలోకమున నసత్సాక్షిగతిన్.

96


వ.

అని పలికి నియమింప నమ్మునికుమారుండు నవ్విధం బాచరించెఁ తదనంతరంబ
వానప్రస్థవిధిప్రకారంబున నమ్మునిపుంగవుడు పూజించి.

97


చ.

కలశభవుండు రామునకుఁ గౌతుక మొప్పఁగ దివ్య మైనయు
జ్జ్వలఘనఖడ్గయుగ్మమును వైష్ణవ మైనశరాసనంబుఁ బెం
పలరునమోఘసాయకము లక్షయతూణయుగంబు నిచ్చి నీ
వలసినవానిఁ గోరు మనివారణ నిత్తు నరేంద్ర నావుడున్.

98


క.

అన్నియు మీకృపఁ గడుసం, పన్నంబుల మాకు నునికిపట్టుగ నిట మీ
రెన్నెల వానతియిచ్చెద, రన్నెలవున నిలుతు మేను ననుజుఁడు సతియున్.

99


క.

అనుటయు నిచటికి దక్షిణ, మునఁ బంచవటం బనంగ మోదావహ మై
తనరుచు గౌతమి చేరువ, వన మొ ప్పగు నందు నిలువు వసుధాధీశా.

100

జటాయుదర్శనము

క.

అని పలికినఁ దగ వీడ్కొని, జనపాలుఁడు లక్ష్మణుండు జనకాత్మజయుం
జనఁ జన నొక్కెడ ముందటఁ, గని రద్భుతమూర్తి యైనకఖగపతి నొకనిన్.

101


సీ.

బలితంపుఱెక్కలు గలిగినమైనాక, కుధరంబు మీఱిన గొప్పమేను
గండభేరుండాదిఖగములఁ గబళించి, వ్రక్కలు గావించువలుఁదముక్కు
నుదయార్కబింబంబు నురుదీప్తిఁ గప్పెడు, ఖరదృష్టిఁ బెంపారుకన్నుఁగవయు