పుట:భాస్కరరామాయణము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనకతనూభవం బరమసాధ్వి నిరంతరభాగ్యలీలలం
దనరినమత్ప్రియన్ దశరథక్షితినాథుననుంగుఁగోడలిన్.

19


క.

అని పలికి వినుము లక్ష్మణ, జనకజదైన్యంబు సూడఁజూలుటకంటెన్
ఘన మగుశోకము నా కెం, దును లే దంబ ప్రియ మందఁ దొఱఁగెదఁ దనువున్.

20


తే.

ధరణిరాజ్యము గోల్పాటుఁ దండ్రిచావు, నిష్టబంధువియోగంబు దుష్టయాతు
నిష్ఠురారణ్యవాసంబు నేఁడు నాదు, దేహదాహంబు సేసె వైదేహికతన.

21


మ.

అని బాష్పాకులలోచనుం డగుచు దైన్యం బొందునన్నం గనుం
గొని సౌమిత్రి మహాభుజంగముగతిం గ్రోధోగ్రనిశ్వాసము
ల్దనరం గంపముతోడ ని ట్లనియె నేలం గూల్చెద వీని నే
విను మీతుచ్చుఁడు నీకు నెంత తలఁపన్ వీరోత్తమగ్రామణీ.

22


తే.

నాఁడు భరతుపైఁ బుట్టిన వేఁడికోప, మగముపై వజ్రి వజ్రంబు నిగుడఁజేయు
నట్లు నేఁడు పుచ్చెద నిద్దురాత్ముమీఁదఁ, దఱుచుకీలాలధారలు ధరణిఁ దొరఁగ.

23


చ.

కనలుచు రుక్మపుంఖవిశిఖంబులు నే డిట వానివక్ష మే
సిన నవి యుచ్చి పాఱి తదసృక్పరిషిక్తము లై వెలింగె వాఁ
డును వడి వైచె నార్చుచుఁ గడుం బెనుమంటలు మింట నెక్కొనం
గనదురువిస్ఫులింగములు గ్రక్కు మహాశనిఁ బోలుశూలమున్.

24


తే.

అదియు సౌమిత్రి కభిముఖం బగుచు నిగుడఁ
గనలి రాముఁడు దాని ముత్తునియలుగను
రెండుబాణము లెడ నడరించి యొక్క
కడిఁదివాలమ్ము వానివక్షమున గ్రుచ్చె.

25


వ.

మఱియును.

26


శా.

సక్రోధుం డయి రాముఁ డప్పుడు భుజాసంరంభ మొప్పార వ
జ్రక్రూరాస్త్రము లైదు శీఘ్రము మెయిన్ సంధించి నానామను
ష్యక్రవ్యాదు విరాధు నేయుటయు వక్షం బుద్ధతిం గాఁడి ని
ర్వక్రక్రీడఁ బగిల్చి యుచ్చి చనినన్ వాఁ డంతఁ బో కుద్ధతిన్.

27


వ.

జానకి డించి.

28


మ.

కదియం బాఱి నృపాలసూనులభుజాగర్వంబు గైకోక బ
ల్లిదుఁ డై డగ్గఱి యుగ్రరోషమున దోర్లీలాసముల్లాసి యై
పొదువం బట్టి వహించె మూఁపుల మహాభూమీధ్రశృంగంబులం
దుదయాదిత్యుఁడు నిందుఁడున్ వెలుఁగున ట్లొప్పారి రయ్యిద్దఱున్.

29


ఉ.

అత్తఱి మిన్ను ముట్టినమహాసురుమూఁపులు గ్రుంగ లావుమై
నొత్తిన వాఁడు నొచ్చియు మహోద్ధతితో నతిఘోరమూర్తి యై
యెత్తుకపోవఁగా నృపతి యేఁగఁగ ని మ్మెట కేఁగెనేని వీఁ