పుట:భాస్కరరామాయణము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీకతరక్షురంకురురునిష్ఠురఫేరవదంతిదంతిభి
ద్భీకరఘోటకారిశలభిత్కిటిమర్కటపుండరీకభ
ల్లూకవృకాదిఘోరమృగలోకములోపల లోలలోచనా.

44


వ.

అదియునుం గాక వనవాసం బధికాయాసం బభ్యాగతుల కిడి మిగిలినకందమూల
ఫలంబు లాహారంబుగాఁ గొనుచుఁ బర్ల శాలల వసియించుచుఁ గుశతల్పంబుల
శయనించుచు విషమస్థలంబులఁ జరియించుచు శీతాతపవర్షంబుల కోర్చుచు
నివ్విధంబున దినంబులు గడపవలయు నీ వత్యంతసుకుమారాంగివి దురంతక్లేశం
బు లనుభవింపఁ జాల విచ్చట నాయమలకు బ్రియాచరణంబు లొనర్చుచుండు
ము నీవు రా వలవ దన నద్దేవి కోపించి యి ట్లనియె.

45


ఆ.

నన్ను నీకు నిచ్చి నరనాథ నాతండ్రి, సంతసించి యుండు నెంతయేనిఁ
జనునె యగ్నిసాక్షి సహధర్మచారిణి. నయిననన్ను నిలువు మనుట నీకు.

46


క.

దనుజమృగోరగభయములు, ననుఁ జెందునె నీవు గలుగ నాథా నాకున్
నినుఁ బాసి మనుటకంటెను, మనమునఁ దలపోసి చూడ మరణం బొప్పున్.

47


తే.

అనిన సీతరాకకు రాముఁ డనుమతించె, నపుడు సౌమిత్రి కోపరక్తాస్యుఁ డగుచు
బొమలు గీలించి విస్ఫులింగములు చెదర, నతులఖడ్గంబు నంకించి యన్నతోడ.

48


చ.

తలఁపఁ నీ వశక్తునివిధంబున నాడెదు రామచంద్ర నీ
కొలఁది యెఱుంగఁ డీతఁ డతికుత్సితుఁ డై మతిఁ దప్పి యాలిమా
టలు విని యింతపెంపున కొడంబడెఁ దా నొకసత్యవాది యై
పలుకఁడె నిన్న నేఁడు నినుఁ బట్టముఁ గట్టెద నంచు బొంకొకో.

49


క.

నిను నభిషిక్తునిఁ జేసెద, ననుచు వసిష్ఠాదిమునులు నఖిలమహీశుల్
విన నాడె నీవరంబులు, తనయాలును దానుఁ గా కితరు లెఱుఁగుదురే.

50


క.

మదనాతురతం బలికిన, యది సత్యం బఁట మహాసభాంతరమునఁ దా
విదితంబు గాఁగఁ బలికిన, యిది బొం కఁట దీని కింక నే మన వచ్చున్.

51


క.

జనకుఁడు నీతిజ్ఞుం డై పనిచినఁ బుత్రులకు నెన్నిభంగులఁ జేయం
జనుఁ గాక తగవు దప్పిన, విన నేటికి ధర్మమార్గ కవిరళవిధంబున్.

52


క.

నీకినుకకు నే వెఱతున్, గా కెవ్వరు గలరు దీనిఁ గా దన నాచేఁ
గేకయులును గీకయులును, గైకేయికిఁ బూనిరేనిఁ గనియెదరు బలే.

53


శా.

అస్మత్కార్ముకముక్తబాణవిసరం బాభీలదంభోళిసం
మస్మేరాగ్రము గాఁగ యుష్మదభిషేకప్రాతికూల్యంబు దా
నస్మార్యం బటు గాక తక్కిన నయోధ్యాపట్టణం బంతయున్
భస్మీభూతము సేసి పుచ్చెద మహీపాలాన్వయగ్రామణీ.

54


వ.

అనిన విని రామచంద్రుండు సౌమిత్రిం గనుంగొని నీవు నాకు భక్తుండ వగు
టయు నెంతకైనం జాలుటయు నే నెఱుంగుదు మనకులాచారగౌరవంబులు నుత్త