పుట:భాస్కరరామాయణము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వని దూతన్ మిథిలేశునొద్దకు రయం బారంగఁ బుత్తెంచినన్.

702


క.

దూతం ద్రోపించి భుజా, స్ఫీతబలం బమర వెడలి పేర్చి సుధన్వున్
వే తాఁకి తునిమి జనకుం డాతనిసాంకాశ్యపురమునం దనుజునకున్.

703


వ.

కుశధ్వజునకుఁ బట్టంబు గట్టె నని జనకునియన్వయక్రమంబు వినిపించి శతానం
దుం డాతనికులశీలపరాక్రమంబులు గొనియాడి సీతగుణంబులు వొగడి నీపుత్రు
నకు సకలగుణాభిరాముం డైన రామునకుఁ జారుగుణశీలసమేత యగుసీతం బెండ్లి
సేసి జగన్నుతకీర్తిఁ బొందు మని పలుక శతానందునిపలుకులకు దశస్యందనుం
డమందానందంబు నొంది వసిష్ఠవిశ్వామిత్రులం గనుంగొని యి ట్లనియె.

704

శ్రీరామలక్ష్మణభరతశత్రుఘ్నుల వివాహమహోత్సవము

లక్ష్మణకుమారునకు జన, కక్ష్మాధీశునిసుతం దగఁగ నూర్మిళ యన్
పక్ష్మలనేత్రను నడుగుఁ డ, సూక్ష్మప్రియమునఁ గుశధ్వజునినందనలన్.

705


క.

అలఘు లగుభరతశత్రు, ఘ్నుల కడుగుఁ డనంగ నడుగఁ గోరికిఁ దనకూఁ
తుల జనకుం డిచ్చితి నని, పలికిన నద్దశరథుండు ప్రమదం బొందెన్.

706


వ.

మఱునాఁ డఖిలజనంబులుఁ బ్రమదం బంద లగ్ననిశ్చయంబు సేయించి.

707


మ.

జనకుం డప్డు వసిష్ఠకౌశికుల వాంఛం జూచి మీ రెంతయున్
ఘనపుణ్యాత్ము లయోధ్యకున్ మిథిలకుం గర్తల్ వివాహంబు లే
పునఁ జేయింపుఁడు యుక్తభంగుల ననం బొల్పొంద నా రేగి నే
ర్పునఁ జేయింప నృపాలుఁ డాభ్యుదయికంబుల్ సేసి ప్రీతాత్ముఁ డై.

708


సీ.

అనురక్తి దశరథుం డభ్యుడయార్థమై, నలువురుసుతులకు నాలుగేసి
లక్షలుగాఁ బదార్లక్షలసంఖ్యల, గోవులఁ గలధౌతకఖురము లలరఁ
గనకశృంగమ్ములఁ గనకపట్టంబులఁ, దామ్రపృష్ఠంబుల దనర నేర్చి
గంధమాల్యాంబరకలితలఁగాఁ జేసి, వత్సలతోఁ గూడ వరుసఁ గూర్చి
కాంస్యలోహలములతోడఁ గరుణ భూసు, రోత్తముల కిచ్చి శోభనాయత్తమతిని
మఱియుఁ బెక్కుసువర్ణముల్ మహిమతోడ, వేఁడువారల కందంద వేడ్క నొసఁగి.

709


వ.

తనయులుం దానును వివిధమణిగణభూషణభూషితులును మాల్యాంబరశోభితు
లును సలలితపరిమళకలితబహుగంధవిలేపనమూర్తులు నగుచుం దనకెలంకుల
బంధుమిత్రామాత్యవర్గంబులు గైసేసి మాతంగతురంగంబులం గొని వీరభటు
లును మునిగణంబులు నేతేరఁ బసిండిపళ్లెరంబుల మణిమయవిభూషణంబులు
నవ్యదుకూలాంబరంబులు మనోహరపుష్పఫలంబులు ననేకసౌభాగ్యద్రవ్యం
బులు నిల్పి క్రంతలు గొని పుణ్యాంగనలు సనుదేర సూతవందిమాగధబృందం
బులు బహువారంబులు కైవారంబులు సేయఁ బంచమహాశబ్దంబులు మ్రోయ
నెలమిని గాయకులు పాడ వారవిలాసిను లాడ నగరద్వారంబు చేర వచ్చి రంత.

710


చ.

నలి నెదు రేఁగుదెంచి యెలనాఁగలు దాఁచినకక్షదీధితుల్