పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్‌ ఆవుల మంజులత, M.A.Ph.D.
వైస్‌ ఛాన్స్‌లర్‌
పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
హైదారాబాద్‌.

పరిచయ వాక్యం

ప్రపంచ విముక్తిపోరాటాల చరిత్రలో భారతీయులు సాగించిన స్వాతంత్య్ర
సంగ్రామం సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర ఘట్టం. బ్రిీటిష్‌ లసపాలకుల
నుండి స్వేచ్ఛ - స్వాతంత్య్రాలు కోరుకుంటూ భరతగడ్డ మీద ఉన్న అన్ని సాంఫిుక జనసముదాయాలు ఏకోన్ముఖంగా పోరుబాటన సాగాయి. ఈ పోరాటాలలో పురుషులతోపాటు మహిళలు కూడ ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్రలను పోషించారు. సమరశీల మహిళలు పురుషులతోపాటుగా ప్రత్యక్షపోరాటంలో భాగస్వాములు కాగా, ఆచార సంప్రదాయాలు, సామాజిక పరిమితులలో ఉన్న మహిళలు ఉద్యమకారులైన తమ కుటుంబ సభ్యులను బ్రిీటిషు ప్రభుయత్వ వ్యతిరేక పోరాటాల దిశగా ప్రోత్సహిస్తూ స్వాతంత్య్ర పోరాటంలో అద్వితీయ పాత్ర వహించారు. కాని, భారతదేశ దాస్య శృంఖలాల విముక్తికి తమ సర్వస్వంఒడ్డి పోరాడిన అనేక మంది మహిళల గురించి నేటితరానికి తెలిసింది తక్కువ. చాలా మంది మహిళల పోరాటగాథలు చీకటి పుటల్లోనే ఉండిపోయాయి. ముస్లిం మహిళల విషయంలో ఈ వివక్ష మరింత ఎక్కువగా కనబడుతుంది. మాతృ దేశం కోసం,జాతి జనుల కోసం పోరాడి, ఆపో పోరాటాలకు స్పూర్తి నిచ్చిన ముస్లిం మహిళల జీవిత చరిత్రలను క్లుప్తంగా మన ముందా ఉంచడం ద్వారా రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నేటి తరానికి అత్యంత అవసరమై న అమూల్యమెన చరిత్ర గ్రంథాన్ని అందించారు. ఇది కేవలం చరిత్ర గ్రంథం మాత్రమే కాదు, చరిత్రలో మరుగునపఫడిన మాణిక్యాలను వెలికితీసి, వారి త్యాగమయ జీవితపు ప్రేరణాత్మక వెలుగులను మనకు
పరిచయం చేసే పరిశోధానాత్మక గ్రంథం.

స్వాతంత్య్ర పోరాటంలో లక్ష్లాలాది మంది పాల్గొన్నారు. అందులో స్త్రీలు కూడ చాలామంది పాల్గొన్నారు. కాని స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న స్రీల గురించి చాలా తక్కువ సమాచారం నేడు అందుబాటులో ఉంది. ముస్లిం స్రీలకు సంబంధించి,