Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

తన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నట్టుగా చుట్టుప్రక్కల ఉన్న ప్రజానీకాన్ని చుట్టుముట్టి ఏ విధంగా సతాయిస్తుందో స్వయం ఆమెది.

ఆనాడు తెలంగాణ ప్రాంతంలో అటు నిజాం నవాబు, ఆ నిజాం నవాబు పేరుతో బ్రతికేస్తున్న భూస్వాములు వందల వేల ఎకరాలను తమ హస్తగతం చేసుకుని రైతులు, ప్రజల మీద పలు దాష్టీకాలకు పాల్పడుతున్నారు. భూమి మీద తిరుగులేని ఆధిపత్యం తెచ్చిపెట్టిన అహంకారంతో రైతాంగం మీదా అంతులేని జులుం ప్రదర్శిస్తున్నారు. ఆనాడు వరంగల్‌ జిల్లా సూర్యాపేట తాలూకా దేశ్‌ముఖ్‌ జానా రెడ్డి ప్రతాప్‌రెడ్ది లక్షా 50వేల ఎకరాలకు, ఖమ్మం జిల్లా మదిర తాలూకా కల్లూరు దేశ్‌ముఖ్‌ లక్ష ఎకరాలకు, నల్గొండ జిల్లా జనగాం తాలూకాకు చెందిన విసున్నూర్‌ దేశ్‌ముఖ్‌ 40వేల ఎకరాలకు, సూర్యాపేట దేశ్‌ముఖ్‌ 20వేల ఎకరాలకు, మిర్యాలగూడ తాలూకా బాబాసాహెబ్‌పేట దేశ్‌ముఖ్‌ 10వేల ఎకరాలకు తిరుగులేని అధిపతులు. ఈ మేరకు 5వేల నుండి 10వేల ఎకరాలు కలిగిన మరెందరో దేశముఖ్‌లు, లక్షల ఎకరాల భూమిని తమ హస్తగతం చేసుకుని రైతాంగం మీద, ఇతర ప్రజల మీద అంతులేని అధిపత్యాన్ని చలాయిసున్నారు.(Telangana peoples Struggle and its lessons, P.Sundaraiah, Foundations Books, New Delhi, Page.9-10)

ఈ భూస్వాములు ప్రజలను గడ్డిపోచల్లా పరిగణిస్తూ, గ్రామాలలో వివిధ వృత్తులతో సేవలందిస్తున్న ప్రజలను తమ ఆజన్మాంత సేవకుల్లా లెక్కిస్తూ భయంకర వెట్టీచాకిరి చేయించుకుంటున్న దారుణపరిస్థితి తెలంగాణలో తాండవిస్తుంది. సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, పైగార్లులు, జాగీద్దారులు, బంజార్దారులు, ఇజ్జద్దారులు, మక్తాద్దారులు, దేశ్‌ ముఖ్‌లు, అగ్రహరీకులు తదితర పేరతో ఈ భూస్వామ్య శక్తులన్నీ భూమిని, సంపదను తమ చెప్పుచేతుల్లో తాము అడింది ఆట పాడిండి పాటగా సాగించుకుంటున్నారు.

భూస్వామి ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అభిష్టానికి కించిత్తు నిరసన వ్యకం చేసినా ఆత్మగౌరవం గల వ్యకికి ఇక నూకలుచెల్లినట్లే. ఈ మేరకు విస్నూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం దిశగా సాగిన రైతాంగ యోధులు బందాగీ భూస్వాముల కుట్రలకు, కరకు కత్తులకు బలయ్యాలు.ఆయన సాగించిన వీరోచిత న్యాయపోరాటం నేపధ్యంగా రూపొందించిన మా భూమి నాటకం అనాడురైతాంగ పోరాటాలకు ఎంతో స్పూర్తినిచ్చింది.


250