పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

భూస్వాముల అక్రమాలను, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రశ్నించే సాహసాన్నిరైతు జనావళిలో రగిలించింది.

ఈ మేరకు సాగుతున్న భూస్వాముల దోపిడిని అరికట్టేందుకు, ఆరాచకాలను చరమగీతం పాడేందుకు ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ముందుకు కదిలారు. ఏమిటీ జులుం ఇంకానా? ఇకపై సాగదు అంటూ తిరగబడ్డారు. ఆ కదలిక చరిత్ర సృషించిన తెలంగాణ రైతాంగపోరాటానికి ఆయువుపట్టయ్యింది. ఈ పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూస్వాములకు అండగా వచ్చిన శక్తులను ప్రజలు స్రీపురుషుల తేడలేకుండ ఎంతో సాహసంతో ఎదుర్కొన్నారు. అందిన ఆయుధాన్ని, వ్యవసాయ పనిముట్టును తీసుకుని పురుషులు ఎగబడగా, మహిళలు రోకలిబండ, కారం సంచుల తోపాటుగా, వడిసెల పట్టి ముందుకు వచ్చారు. ఈ విధంగా ప్రత్యక్ష్యంగా శత్రువుతో తలపడిన వారు కొందరైతే, పరోక్ష్యంగా పోరుబాటన నడుస్తున్న యోధులకు, దళాలకు ఆశ్రయం కల్పించటం, ఆతిధ్య మివ్వటం, ఆయుధాలను అందివ్వటం, శత్రువు రాకపోకల సమాచారాన్నిచేరవేయటం, పార్టీ నుండి అందిన ఆదేశాలను, రహాస్య సమాచారాన్ని పోరాట వీరులకు అందచేయ డం లాంటి వ్యవహారాలను మహిళలు చాలా సమర్ధవంతంగా నిర్వహించారు.

ఆ క్రమంలో రాజారం నివాసి జైనాబీ కూడ ఇతర మహిళా యోధురాళ్ళతో సమానంగా అత్యంత ప్రధానమైన రహాస్య కార్యకలాపాలను ఎంతో సమర్ధతతో నిర్వహించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె ప్రత్యక్ష్యంగా పాల్గొనకపోయినా, పోరాటయోధులకు అన్నపానీయాలు అందిస్తూ సహాయపడ్డారు. ప్రధాన దళం నుండి తప్పిపోయిన యోధులను క్షేమంగా దళంలో చేర్చటంలో ఎంతో సాహసోపేతంగా ప్రవర్తించారు. దండు రహాస్యాలు చెప్పమని వేదించిన మిలటరీ హింసాకాండను తట్టుకు ని నిలబడ్డారు . భయానక చిత్రహంసలు, వేదింపులకు గురవుతూ కూడ అత్యంత రహాస్యంగా అతి చాకచక్యంతో శత్రువు గూఢచారుల కళ్ళుగప్పి దళసభ్యులకు జైనాబీ సహాయ సహకారాలు అందించి, ప్రజలు ప్రధానంగా రైతులు సాగిస్తున్న సాయుధా పోరాటం ఉజ్వలంగా సాగడనికి జైనాబీ తొడ్పడ్డారు.

ఈ విధంగా తెలంగాణ సాయుధాపోరాటంలో తనదైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించిన జెనాబీ గురించి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు శ్రీ పుచ్చలపల్లి సుందారయ్య విరచిత 1972లో ప్రచురితవున Telangana Peoples Struggle and its Lessons


251