పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

పోలీసులు దృష్టిషిసారించారు. జాతీయోద్యమ నేతల మీద ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మౌలానాను గృహనిర్భంధంలోకి తీసుకుని, ఆయన కదలికల మీద ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను ఖాతరు చేయనందున 1916 ఏప్రిల్‌ 13న మౌలానాను ప్రభుత్వం మరోసారి నిర్భంధంలోకి తీసుకుంది. ఆంక్షతో కూడిన స్వేచ్ఛను ప్రభుత్వం ప్రసాదిస్తాననగా అందుకు మౌలానా వ్యతిరేకించారు. మౌలానా హసరత్‌ తీసుకున్న ఆ నిర్ణయం పట్ల మౌలానా ఆజాద్‌, అలీ సోదరులు ఆందోళన వ్యక్తంచేయగా బేగం నిశాతున్నీసా మాత్రం ఎటువంటి జంకు లేకుండా భర్త నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆంక్షలతో కూడిన స్వేచ్ఛ కంటే జైలు జీవితం ఎంతో మేలు అని ప్రకటించారు.

( She declared that arrest was better than detention and that her husband had done well by rejecting the conditions proposed by the British Empire's toadies - Hasrath Mohani, Page.46-47)


పల్లెటూరు నుండి విచ్చేసిన పడతిలో ఇంత ధైర్యం, సాహసం, హేతుబద్ద ఆలోచనల వ్యక్తీకరణలను గమనించిన ప్రముఖ నాయకులు అమితాశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసాలో దాగిఉన్న శక్తియుక్తులన్నీ బహిర్గత మయ్యాయి. మౌలానా విడుదల కోసం అధికారులతో పోరాడుతూ, న్యాయ వాదులను కలసి ఒకవైపు న తీవ్రంగా కృషిచేస్తూ మరోవెపు న మౌలానా పక్షాన ప్రజలకు, పత్రికలకు సమాచారం అందిస్తూ ప్ర ముఖ జాతీయోద్యమ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, అభిప్రాయాలను పంచుకుంటూ, జాతీయోద్యమ కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

మౌలానాను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఒక్కచోట ఉంచకుండా రహాస్యంగా పలుచోట్లకు మార్చుతున్నప్పటికి ఎంతో చాకచక్యంతో ఆ విషయాలను తెలుసుకుంటూ భర్త పరిస్థితిని, ఆయన అభిప్రాయాలను ప్రజలకు, జాతీయోద్యమ నేతలకు తెలుపుతూ మౌలానాకు ప్రజలకు ఆమె సంధానకర్తలా వ్యవహరించారు. ఆ సమయంలో కూడ మౌలానా పక్షాన వాదించేందుకు న్యాయవాదులు ముందుకు రాలేదు . ఆ సంక్లిష్ట పరిస్థితులను కూడ తట్టుకుంటూ భర్త పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు.

మøలానా జైలులో ఉన్నప్పుడు ఆయన సంకల్పబలాన్ని, ప్రభుత్వానికి తలవంచని

115