ప్రసంగాలతో ప్రజలను ఉద్యమ దిశగా నడిపిన దిట్ట
అక్బరీ బేగం
ప్రజా పోరాలలో మహిళలు పాల్గొనటం ఒకవంతైతే ఆ పోరాలలో పాల్గొనటమే కాక, తోటివారిని కూడ పాల్గొనట్టు చేయటం గొప్పవిద్య. అది ఆయా వ్యకుల స్వచ్చమైన ప్రవర్తన, నిజాయితీ, నిబద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు జాతీయోద్యమం తొలిదశలో జరిగిన ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమం దిశగా మహిళలను కార్యోన్ముఖులను చేయటమే కాకుండ, ఆయా స్త్రీల కుటుంబ సభ్యులను కూడ పోరాట దిశగా నడిపించే సత్తాగల ఆలోచనాత్మక ప్రసంగాలను చేసిన యోధురాలిగా శ్రీమతి అక్బరీ బేగం ఖ్యాతిగాంచారు.
ఆమె ప్రముఖ స్వాతంత్య్రోద్యమకారుడు, న్యాయవాది ఆసఫ్ అలీ తల్లి. ఆమె భర్త అహసన్ అలీ. ఆయన పోలీసు అధికారి. స్వమతం పట్ల అత్యంత భక్తిప్రపత్తులున్నా ఇతర మతాల పట్ల వివక్షత చూపని విశాల హృదయం ఆమెది. ఆమె కుమారుడు హిందూ యువతి అరుణా గంగూలిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె కొంత కినుకు వహించినా ఆ తరువాత అరుణా ఆసఫ్ అలీని ఆదరించి కూతురు స్థానం కల్పించారు. ఆరుణా అసఫ్ అలీకి ఆమె ఉర్దూ నేర్పారు. ఆమెతో కలసి అక్బరీ
101