సయ్యద్నశీర్అహమ్మద్
ఆ మహనీయుని పెద్ద కుమార్తె ఫాతిమా బేగం. ఆమె కుంటుంబం అంతా సబర్మతీ
ఆశ్రమంలో గడిపింది. ఆ కారణంగా ఫాతిమా గాంధీజీ కనుసన్నలలో పెరిగారు.
ఆశ్రమంలో అన్ని పనులలో ప్రతిఒక్కరికీ చేదోడుగా ఉంటూ ఆశ్రమ నిబంధనలను
పాిటిస్తూ ఆశ్రమవాసుల, ప్రత్యేకంగా మహాత్ముని ప్రశంసలను అందాుకున్నారు.
ఆమె తండ్రి అబ్దుల్ ఖాదిర్ను గాంధీజీ స్వంత సోదరునిగా భావించి గౌరవించారు. ఆ అనుబంధంతో 20 సంవత్సరాల ఫాతిమా వివాహం విషయంలో గాంధీజీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆమె వివాహా ఆహ్వానపత్రాన్ని ఆయన స్వయంగా రూపొందించారు. ఆ వివాహానికి ప్రముఖులను, ప్రజలను ఆహ్వానిస్తూ 1920 ఏప్రిల్ 2న వెలువడిన ఆహ్వాన పత్రిక గాంధీజీ పేరిట ప్రచురితమై జాతీయోద్యమ సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఆ ఆహ్వాన పత్రిక ఇలా సాగింది.
ప్రియమైన మిత్రమా! ఫాతిమా బేగం నా మిత్రులు మరియు నా సోదరులు ఇమాం అబ్దుల్ ఖాదిర్ సాహెబ్ గారి జ్యేష్ట పుత్రిక. ఇమాం సాహెబ్ దాక్షిణాఫ్రికాలో, భారత దేశంలోని ఆశ్రమ, జైలు జీవితంలో నా సహచరులు. సయ్యద్ హుస్సేన్ మియాతో ఫాతిమా బీబీ వివాహం 1920 ఏప్రిల్ 26 తేది శనివారం సాయంత్రం ఏడు గంటలకు జరపాలని నిశ్చయమైంది. ఆరున్నరకు మిలాద్ షరీష్ ఆరంభమవుతుంది. ఈ సంతోషకర సమయంలో మీరు కూడ పాల్గొని వధూ, వరులను తమ శుభాకాంకలతో అలంకృతులను చేయగలరు.
ఇట్లు మోహన్దాస్ కరంచంద్ గాంధీ.
ఈ వివాహ కార్యక్రమం గాంధీజీ ఆద్వర్యంలో అతి సాదాసీదాగా పూర్తయ్యింది. ఈ వివాహం గురించి గాంధీజీ తన నవజీవన్ పత్రికలో విశేషంగా ఉలేఖించారు. వివాహం తరువాత ఫాతిమా అత్తవారింకి వెళ్ళింది. ఆశ్రమ జీవితంలో అలవర్చుకున్న శిక్షణ, సహష్టుత, దేశబక్తి సామాజిక సేవాభావాలను అత్తవారింట పరిమళింప చేయాల్సిందిగా కోరుతూ గాంధీజీ ఆమెను ఆశీర్వదించారు. ఆ దిశగా అత్తవారింట కూడ జాతీయోద్యమ భావాలను పరిమళింప చేసిన ఫాతిమా బేగం చిన్న వయస్సులోనే కన్నుమూశారు.
100