పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

323


గావింపుచు హుతాశనునకుఁ ద్రివారముగాఁ బ్రదక్షిణ
నమస్కారంబు లాచరించి భూసురోత్తములకుం బ్రణమిల్లి
పౌరజానపదవర్గంబు లాబాలవృద్ధంబుగా నిరీక్షింపుచుండ
ముకుళీకృతకరకమలయై దహనంబునం బ్రవేశించుసమయం
బున.

216

మనోరంజనికి సాంబమూర్తి ప్రత్యక్షంబగుట

మ.

ధవళాంగుండు శశాంకశేఖరుఁడు భక్తత్రాణపారీణుఁ డిం
ద్రవిరించ్యాదులు చుట్టుఁ గొల్వ వృషభోద్యద్వాహనారూఢుఁ డై
భువియు న్నింగియు వెల్గుచుండ గిరిరాట్పుత్రీసమేతంబుగా
శివుఁ డేతెంచి కరంబుఁ బట్టి తిగిచెన్ శీఘ్రంబు వారాంగనన్.

217


వ.

అంత.

218


శా.

ఆవేశ్యాంగన ఫాలలోచను శశాంకాదిత్యకోటిప్రభున్
దేవర్షిస్తవనీయపాదకమలున్ దేదీప్యమానాంగునిన్
భావాతీతచరిత్రుఁ గాంచి విలసద్భక్తిన్ బ్రణామంబులన్
సేవ ల్సేయుచునుండె భీత యగుచున్ జిత్తంబు రంజిల్లఁగన్.

219


సీ.

అంత నాపరమేశుఁ డయ్యింతిఁ గనుఁగొని
       పలికెఁ గారుణ్యార్ద్రభావమునను
నీదుధర్మమ్మును నిర్మలజ్ఞానంబు
       సత్యంబు దృఢభక్తిసౌష్ఠవంబు
శీలంబుఁ దగఁ బరీక్షించుటకై యేను
       వైశ్యరూపముఁ బూని వచ్చి తబల
మంటపదాహంబు మణిలింగభిన్నంబు
       నింతయు నామాయ యెంచిచూడ