Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

233


ద్రాయువు నాదుపేరును మదంబయు నేనును వీనియింట న
త్యాయతవైభవంబున నహర్నిశము న్వసియింతు మెంతయున్
శ్రేయము మీఱ మత్కథ యశేషముగా వివరింతు మీఁదటన్.

170


ఆ.

ఇపుడు పోయివత్తు నే వచ్చుదనుక నీ
జడుని మగధవిభుని విడువవలవ
దనుచు విన్నవించి యాక్షణంబున నేఁగె
సఖుఁడుఁ దాను నాత్మసదనమునకు.

171


వ.

అ ట్లరుగుదెంచి.

172


మ.

జననీపాదసరోరుహంబులకు శశ్వద్భక్తితో మ్రొక్కి చ
య్యనఁ దాఁజేసినకార్యమంతయును నాద్యంతంబుగాఁ జెప్పిన
న్విని తన్మాతయు హృష్ట యై నిజసుతు న్వేవేడ్క నాశీర్వదిం
చెను బద్మాకరుఁ డంతఁ గౌఁగిటను జేర్చె న్గౌరవం బొప్పఁగన్.

173


క.

ఈతెఱఁగున భద్రాయువు
మాతృసమేతముగ వైశ్యమందిరమున వి
ఖ్యాతసుఖంబున నుండెను
జేతోమోదంబు వెలయ శివతత్పరుఁ డై.

174


తే.

రణములో నొక్కరుండు శాత్రవులఁ గెలిచి
జయము చేకొనివచ్చె నిర్భయత గాఁగ
గురుకటాక్షంబుఁ జెందిన కుశలమతుల
కవని సాధింపరానికార్యములు గలవె?

175


వ.

అంత.

176

సూర్యాస్తమయవర్ణనము

తే.

ఆదశార్ణక్షమాపాలు ననుఁగుసుతుని
చండశౌర్యప్రభావంబు సైఁపలేక