Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

బ్రహ్మోత్తరఖండము


ఘోరదారిద్ర్యాంధకారంబు లెడఁబాపి
        భాసురైశ్వర్యసంపన్నుఁ జేసె


తే.

నట్టియాభూసురాంగన నపుడు తనయ
సంయుతంబుగ రప్పించి జననిమాడ్కిఁ
దనదు శుద్ధాంతమున నుంచి దయ దలిర్ప
నిజవధూయుక్తుఁ డగుచు మన్నింపుచుండె.

382


క.

ఆరాజదంపతుల తన
కూరిమి రంజిల్లఁగాను గోడలుఁ గొడుకుం
గా రహి భావింపుచు నతి
గారాబము చేయుచుండె గాంభీర్యమతిన్.

383


వ.

ఇవ్విధంబున.

384


మ.

జనకుం జంపినవైరము న్మరలఁగా సాధించి దుర్మర్షణుం
జనితామర్షణుఁ బోరిలోఁ దునిమి రాజ్యం బేలెఁ దాఁ గ్రమ్మరన్
జనసంస్తుత్యుఁడు ధర్మగుప్తుఁడు శివాచారంబు దీపింప న
జ్జననాథాగ్రణిసాటిగాఁ గలరె భూచక్రంబులోఁ బార్థివుల్.

385


క.

దశవర్షసహస్రంబులు
పశుపతిపూజావినోదపారీణుం డై
భృశతరసామ్రాజ్యశ్రీ
వశుఁ డయి నిష్కంటకముగ వసుమతి నేలెన్.

386


వ.

ఇట్లు ధర్మగుప్తుండు జన్మాంతరకృతం బయినప్రదోషశివ
పూజావమానదోషంబున బాల్యకాలమునఁ దాదృశం
బగుదైన్యం బనుభవించి క్రమ్మఱ మహేశ్వరారాధనతత్ప
రుండయి తత్సుకృతమున నిజభార్య యైనగంధర్వకన్యక
తోడం గూడి పితృపైతామహం బయినరాజ్యమున నఖండ