Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

125


నంత నారాజనందనుం డయ్యుమాపుత్త్రుం డయిన శుచి
వ్రతున కి ట్లనియె.

377


తే.

సమరమున వైరివీరుల సంహరించి
యస్మదీయమహీరాజ్య మాక్రమించి
మిమ్ము రావింతు నని పల్క సమ్మతించి
చనియె ద్విజనందనుం డాత్మసదనమునకు.

378


వ.

తదనంతరంబ.

379

ధర్మగుప్తమహారాజు తనశత్రు వైనదుర్మర్షణుని వధించి తనరాజ్యంబు మరలఁ గైకొనుట.

మ.

కృతకృత్యుండగు ధర్మగుప్తవిభుఁ డీరీతిన్‌ గృతోద్వాహుఁడై
చతురంగంబులు గొల్వఁగాఁ జని ద్విషత్సైన్యంబులం ద్రుంచి యు
ద్ధతి దుర్మర్షణుఁ బోరిలో శ్వశురదత్తం బైనయాశక్తిచే
హతునిన్ జేసి పురంబుఁ జొచ్చె నిజమిత్రామాత్యయుక్తంబుగన్.

380


శా.

భేరీవాద్యము లుల్లసిల్లఁ బరమప్రీతాత్ముఁడై వైభవ
శ్రీ రంజిల్లఁ బురంబుఁ జొచ్చి విలసత్సింహాసనాసీనుఁ డై
గౌరీనాథుకృపాకటాక్షమున దోర్గర్వంబు దీపింపఁగా
దా రాజ్యం బొనరింపుచుండెను సమస్తారాతిసంహారుఁడై.

381


సీ.

ఏవిప్రసతి మాతృహీనునిఁ దనుఁ దెచ్చి
        మచ్చిక చేసి చన్నిచ్చి పెంచె
జాతకర్మాదిసంస్కారంబు లొనరించి
        శ్రీగురుకారుణ్యసిద్ధుఁ జేసె
సతతప్రదోషసువ్రతశీలు గావించి
        పరమేశుపూజనాపరుని జేసె