|
నంత నారాజనందనుం డయ్యుమాపుత్త్రుం డయిన శుచి
వ్రతున కి ట్లనియె.
| 377
|
తే. |
సమరమున వైరివీరుల సంహరించి
యస్మదీయమహీరాజ్య మాక్రమించి
మిమ్ము రావింతు నని పల్క సమ్మతించి
చనియె ద్విజనందనుం డాత్మసదనమునకు.
| 378
|
ధర్మగుప్తమహారాజు తనశత్రు వైనదుర్మర్షణుని వధించి తనరాజ్యంబు మరలఁ గైకొనుట.
మ. |
కృతకృత్యుండగు ధర్మగుప్తవిభుఁ డీరీతిన్ గృతోద్వాహుఁడై
చతురంగంబులు గొల్వఁగాఁ జని ద్విషత్సైన్యంబులం ద్రుంచి యు
ద్ధతి దుర్మర్షణుఁ బోరిలో శ్వశురదత్తం బైనయాశక్తిచే
హతునిన్ జేసి పురంబుఁ జొచ్చె నిజమిత్రామాత్యయుక్తంబుగన్.
| 380
|
శా. |
భేరీవాద్యము లుల్లసిల్లఁ బరమప్రీతాత్ముఁడై వైభవ
శ్రీ రంజిల్లఁ బురంబుఁ జొచ్చి విలసత్సింహాసనాసీనుఁ డై
గౌరీనాథుకృపాకటాక్షమున దోర్గర్వంబు దీపింపఁగా
దా రాజ్యం బొనరింపుచుండెను సమస్తారాతిసంహారుఁడై.
| 381
|
సీ. |
ఏవిప్రసతి మాతృహీనునిఁ దనుఁ దెచ్చి
మచ్చిక చేసి చన్నిచ్చి పెంచె
జాతకర్మాదిసంస్కారంబు లొనరించి
శ్రీగురుకారుణ్యసిద్ధుఁ జేసె
సతతప్రదోషసువ్రతశీలు గావించి
పరమేశుపూజనాపరుని జేసె
|
|