Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

బ్రహ్మోత్తరఖండము

హనుమంతుఁడు రాజులకుఁ బ్రత్యక్షంబై గోపబాలునికథఁ జెప్పుట.

శా.

అంతన్ సర్వధరాధినాథులు ప్రమోదాయత్తులై చూడ శ్రీ
మంతుం డుజ్జ్వలకీర్తిమంతుఁ డతిధీమంతుండు దైతేయదు
ర్దాంతుం డంచితరామనామజపమంత్రధ్యానసంతోషిత
స్వాంతుం డాహనుమంతుఁ డయ్యెడను సాక్షాత్కారుఁ డయ్యెన్ గృపన్.

250


క.

క్షిత్యధినాయకు లందఱు
నత్యుజ్జ్వలతేజుఁ డైనహనుమంతునకున్
బ్రత్యుత్థానముమొదలుగ
శ్రుత్యుపచారము లొనర్చి శోభిల్లి రొగిన్.

251


క.

ఆక్షితిపులమధ్యంబున
నక్షాసురదమనుఁ డైనయనిలజుఁ డొప్పెన్
నక్షత్రమండలంబున
నక్షత్రేశ్వరునికరణి నభినుతుఁ డగుచున్.

252


వ.

ఇట్లు రాజసభామధ్యంబున గూర్చుండి యమ్మరున్నందనుండు
గోపకుమారు నుద్దేశించి యమ్మహీనాథులతో ని ట్లనియె.

253


క.

ఈవల్లవబాలుఁడు ధర
జైవాతృకుఁడై యశోవిశాలుం డగుచున్
బావనచరితుం డగుచును
శ్రీవెలయఁగ బేరు గాంచు శ్రీకరుఁ డనఁగన్.

254


ఆ.

అరయ నితనికులజుఁ డష్టమపురుషుండు
నందుఁ డన జనించునందనుండు