పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

97


వంబు మెఱయ హేమరత్నమయం బైన నూతనశివాల
యంబునకు వచ్చి యమ్మహాదేవుదర్శనంబు గావించి
సాష్టాంగదండప్రణామంబు లాచరించి యందఱు సభాస్తర
ణంబుల సుఖాసీనులై మృదుమధురసల్లాపంబు లొనర్చుచుఁ
బరమానందంబున సుఖవృత్తి నుండి రంత.

244


క.

ఆభూమీశ్వరు లపు డా
యాభీరకుమారు గుణగుణాలంకారుం
బ్రాభవరేఖాకారున్
శోభితశంకరవిచారుఁ జూచిరి ప్రీతిన్.

245


శా.

వాత్సల్యంబున బాలకుం బిలిచి సంభావించి యాభూపతుల్
స్వోత్సంగంబుల నుంచి తద్గుణగణోద్యోగ ప్రచారంబులం
దత్సామర్థ్యముఁ దన్మనోదృఢతయున్ దర్శించి యూహించి య
త్యుత్సాహంబున నిచ్చి రప్పుడు ప్రభాయుక్తార్హభూషావళుల్.

246


ఉ.

కొందఱు ఘోటకంబులను గొందఱు భద్రగజోత్కరంబులన్
గొందఱు చామరంబులను గొందఱు భవ్యసితాతపత్రముల్
గొందఱు భేరికాదులను గొందఱు రత్నకిరీటకేతువుల్
గొందఱు రాంకవంబులను గోపకుమారున కిచ్చి రానృపుల్.

247


వ.

మఱియును.

248


క.

గోపతి విభవము మెఱయఁగ
గోపకులంబునకు నెల్ల గురుఁ డగు నంచున్
గోపాధ్యక్షుని జేసిరి
గోపార్భకు నచటఁ గలుగుగోత్రాధిపతుల్.

249