లేదు. "భక్తిన్ పునర్నమ్రుఁడై " అని మాత్రమే గలదు. ఇది 5 మాత్రలుగల ఖండగతిని నడచును.
- వినయాన - 5 లఘువులు లేక మాత్రలు
- తేంద్రాది -
- బృందార -
ఇట్లే దండకమున ప్రయుక్తమైనవి కావున నిది ఖండగతి నడచు దండకము.
దండకములకు రగడవలె గతి భేదములున్నవి. నన్నయ భారతమున తొలిదండకమున “శ్రీకంఠ - లోకేశ - లోకోద్భ -వస్థాన సంహార - కారీము" అని తకారముతో ప్రారంభము. ఇదియు ఖండగతినే నడచును.
- శ్రీకంఠ 5 లఘువులు లేక మాత్రలు
పైరీతిగా దండకములను తాళప్రధానములుగా పరిశీలింపవలసిన ఆవశ్యకత యున్నది.
4. ఉత్సాహవృత్త మిందు ఆశ్వాసాంతమున నున్నది. ఆశ్వాసాంతపద్యములలో ఉత్సాహవృత్తము వాడరు. ఈ కవులు మాత్రము వాడినారు.
5. భుజంగప్రయాతము (4-72.) భుజంగప్రయాత మిందు ఆశ్వాసాంతమున నున్నది. ఇదియు నాశ్వాసాంతముల వాడుకలేదు. పైదానివలెనే క్రొత్తవాడుక.
6. మణిగణనికరము ఈవృత్తము నన్నెచోడాది ప్రాచీనకవులు వాడిరి.
ఇది 15వది యగు ఆతిశక్వరీ ఛందస్సున బుట్టినది.
| అనవుడు మనసును నతిముదమున న | (5-40) |