పురుషుం డి ట్లుపనిషద్వివేకులు చెప్పినవాక్యంబుల యర్ధంబులు పలుమాఱు
నాలోచించునవసరంబున నిదిధ్యాసంబు వచ్చి వివేకపురుషుల కనతి
దూరంబుననున్న యుపనిషద్దేవిం జేసన్న చేసి పిలిచి "విష్ణుభక్తిమహాదేవి
నాచేత నొక్కరహస్యంబు నానతిచ్చి పుచ్చె నది వినుము. దేవతలు సంక
ల్పయోనులు గాన వివేకునిసన్నిధానమాత్రంబున గర్భిణివైన నీజఠర
గోళంబునఁ గ్రూరసత్వయగు విద్యయను కన్యకయుఁ బ్రబోధచంద్రుండను
కుమారుండు నుండుట యెఱింగితి నందు విద్యాకన్యకారత్నంబును సంక
ర్షణవిద్యచేత మనస్సుచే సంక్రమింపం జేయుము. ప్రబోధచంద్రునిఁ బురు
షునియందు నిల్పుము. నీవును వివేకునిం గూడుకొని నాసమీపమ్మునకుఁ
జనుదెమ్మని పలికెనని చెప్పిన నిదిధ్యాసనంబు పురుషునిఁ బ్రవేశించె
నత్తఱి నుపనిషత్తరుణియు విష్ణుభక్తి యానతిచ్చినవిధంబు చేసె నప్పుడు
పురుషుండు ధ్యాననిమీలితాక్షుఁ డగుటయు.