పుట:ప్రబోధచంద్రోదయము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాదిమంత్రిరక్షితంబైన యౌవరాజ్యంబు పాలింప నిన్నూఱడింప విష్ణు
భక్తిచేతం బంపువడి వచ్చిన యీమైత్రి మొదలయిన చెల్లెండ్రు నలువు
రకుఁ గన్నులపండువుగా నాయుష్మంతుండవై సామ్రాజ్యంబు చేయుము
నీకు నీరీతి చిత్తస్వాస్థ్యంబు గలిగిన క్షేత్రజ్ఞుండును నిజప్రకృతిం గూడు
నది యెట్లంటేని.

42


సీ.

ఈవును బుత్రసమేతుండవైతేని
                          శాశ్వతుఁ డయ్యును నీశ్వరుండు
భవజరామరణాద్యుపప్లవంబులఁ బొంది
                          యుండఁ జూడంగ నిత్యుండుఁబోలె
నొక్కఁడ యయ్యును బెక్కులు బుద్ధిమం
                          తులలో ననేకమూర్తులు ధరించి
చాంచల్యమునఁ బొందు జలధివీచీతతిం
                          బ్రతిబింబితార్కబింబంబుఁ బోలె


గీ.

కొడుక! నీవు నివృత్తితోఁ గూడితేని
నిర్మలాదర్శలక్షితనీరజాప్త
బింబమును బోలి నిశ్చలత్వంబు నొంది
సంతతానందము వహించు నంతరాత్మ!

43


మ.

అని భోధించిన శారదారమణిపాదాంభోజయుగ్మంబుపై
మన సత్యంతకుతూహలంబునఁ బ్రణామంబు ల్ఘటింపంగ నా
వనజాతాసనురాణియున్ మనసుతో వత్సా! మృతజ్ఞాతిబం
ధునికాయంబున కీనదిం జలుపుమా తోడ్తో నివాపాంజలుల్.

44


వ.

అనవుడు నమ్మన సట్లు గావించె నిత్తెఱం గంతయు దివ్యచిత్తంబున
నెఱింగి విష్ణుభక్తిమహాదేవి శ్రద్ధం గనుంగొని శ్రద్ధాంగనా! మనమనికితం
బంతయుఁ బాసె నింక నీవు జీవమహారాజువద్దికిం జని యచ్చటం జేయ
వలసిన కృత్యంబు లనుసంధింపుచుండు మని పనిచి శాంతిం జూచి నీవు
వివేకునికడకుం జని యతనికిఁ బరిచారంబులు సలుపుము నేనును నతనికి