పుట:ప్రబోధచంద్రోదయము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హుండును వివేకునిం బరాజితుఁ జేసి యీవారణాసియే రాజధానిగా
రాజ్యంబు చేయవలయునని చిత్తంబునం గలదు గావున నేట రేపటలోన
నింద్రలోకంబునుండి యిచ్చటికి విచ్చేయు ననువార్త వినంబడుచున్నది
యనిన దంభుండు విద్యాప్రబోధజన్మభూమియు, నిరత్యయంబునునైన
యీ కాశికానగరంబు దండ చేసికొని వివేకుండు కులోచ్ఛేదంబు గావింపఁ
గాచుకొని యున్నవాఁడు. దీనికిఁ బ్రతికారం బతిదుర్ఘటం బది యెట్లంటేని.

24


క.

పరమజ్ఞానం బెఱుఁగని
నరులకు నీ వారణాసినగరిని విశ్వే
శ్వరుఁ డంత్యకాలమున సు
స్థిరకరుణం దారకోపదేశము చేయున్.

25


క.

ఐనను గామక్రోధా
ధీనుల కది దొరక దిచట దృఢనియతవచో
మానసకరపదములు గల
ధీనిధులకుఁ గాక కలవె తీర్థఫలంబుల్.

26


క.

అనుచు నహంకారుఁడు దం
భునితో మాటాడు సమయమునఁ గ్రందుకొనన్
వినువీథిని వినవచ్చెను
ఘననిస్సాణాదివాద్యకలకల మంతన్.

27


సీ.

కలయంగఁ గస్తూరి కలయంపి చల్లిరి
                          వినుకాంతమాణిక్యవేదికలను
యంత్రమార్గము లెల్ల ననువుగాఁ దీర్చిరి
                          ధారాగృహాంతరాంతరములందు
నవరత్నమయతోరణంబులు గట్టిరి
                          వారక గోపురద్వారములను
మెఱుఁగారు మేడలమీఁద నిల్చిరి పురం
                          దరధనుర్ధామచిత్రధ్వజములు