పుట:ప్రబోధచంద్రోదయము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బైనదహనంబు నార్చి తానుం దూలిపోవదే. కావునం బాపకారి యగువివే
కుని నానాప్రకారంబులం జెఱుపవలయునని పెక్కుపాయంబులు వర్తింపు
చున్నవారని విన్నవించిన మెచ్చి తనదేవి మతిం గనుంగొని.

66


మ.

తనతండ్రిం బరము న్నిరంజను జగద్భర్తం గదా కట్టివై
చె నహంకారునిఁ గూడి మజ్జనకుఁ డబ్భేద్యంపుఁబాశంబులన్
మునుపుం దాముఁ దదానుకూల్యపరు లీమోహాదులంచుం జుమీ
తునుమం జూచితి నమ్మ నమ్ముఁ దము నిందున్ దోషి నే నౌదునే.

67


క.

కార్యాకార్యము లెఱుఁగ క
నార్యత వర్తించుగురువునైనను విడువన్
మర్యాద యనుచు వృద్ధా
చార్యులు పలుకుదురు వేదసమ్మత మగుటన్.

68


ఉ.

సారసుఖైకమూర్తియగు సర్వజగత్పతిఁ గట్టిమోహనం
సారపయోధిఁ ద్రోచిన విచారవిహీనులు తారు మంచివా
రైరఁట తత్సదాశివుని నంటిన దుర్దశ మాన్పఁ దమ్ము సం
హారము చేయు మే మఁట దురాత్ములమో కలకంఠి వింటివే.

69


ఆ.

అనిన మతివధూటి యావివేకునిఁ జూచి
ప్రాణనాథ! మోహపాశములను
నిర్ణిరోధమహిమ నిత్యప్రకాశుఁ డా
పరముఁ డెట్లు కట్టుపడియె ననిన.

70


హరిణీవృత్తము.

సదమలనయస్వచ్ఛుడైనం బ్రశాంతి వహించి తా
నొదవు ధృతులఁ బ్రౌఢుఁ డైన న్మహోదయధీకళల్
వదలు హరినేత్ర లీలం దలంపఁగ మాయతన్
బొదువ మఱచె నీశ్వరుండుం బ్రబోధము నావుడున్.

71


ఆ.

మేఘరేఖ యొకటి మిహిరున కడ్డంబు
వచ్చినంత నతనివన్నె చెడునె