పుట:ప్రబోధచంద్రోదయము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దిరశరణంబు తేఁటిగమి నీలము లింద్రుని పేరు గాంచె పె
న్నిరులు గుహాశ్రయంబు గనియెన్ నెఱిగల్గినవారి కోర్తురే.

(3-68)


17.క.

నెరసె నెఱసంజ చక్రక
సరసీరుహవిరహభేదసంసూచకమై

(3-133)


18.మ.

గురుబంధుల్ దనుఁ జుట్టి రాదిగిచి యాక్రోశింప నిశ్చేష్టుఁడై
యెరలం దన్ను నెఱుంగలేక యసహృత్ వ్యూఢార్తి ముంజెంది చూ
పరతన్ మ్రోయుచుఁ బో వివర్ణతమెయిం బాటిల్ల

(3-160)


19.క.

అరిగి సమిత్ప్రసవకుశాం
కురపక్వఫలోత్కరంబుఁ గొని గృహమునకున్
మరలి యట వచ్చునప్పుడు
ధరణీసురనందనుండు దనకట్టెదురన్.

(3-177)


20.ఉ.

ఱెక్కలతో సరాగము నెఱిం బరికింపఁడు వేడ్కఁ జెంది యో
యక్కనకాచలంబు విబుధాధ్వమునం జనుదెంచుచున్న

(3-192)


21.ఉ.

జాఱుటయుం దదూరుయుగసాంద్రరుచుల్ కటిమీఁదనుండి దై
వాఱఁగఁ గాంచి పంచశరపంచశరీపరికంపితాత్ముఁడై
పాఱుఁడు దాబహుశ్రుతము బల్మియు భావవిశుద్ధి కల్మియున్
మీఱిన నెమ్మనంబు గడిమి న్నిలుపోపఁగలేక లోలతన్.

(3-251)


22.సీ.పా.

రాయైన తబిసి పేరంటాలిఁ గ్రమ్మర
గలిగించు నడుగుచే వెలసినాఁడు

(3-291)

నందిమల్లయ - మదనసేనము

నదిమల్లయ మదనసేనము అనుకావ్యమును రచించినట్లు పెదపాటి జగ్గన ప్రబంధరత్నాకరమునుండి యీ క్రింది పద్యములవలన మనకు తెలియుచున్నది.