ఈ నాటకమున ప్రబోధచంద్రుని జననమైన తరువాత, వివేకుడు ముక్తికన్యను గాంచును. ఆ కన్య పెద్దదియైన వెనుక స్వయంవరము చాటించును. ఈ స్వయంవర మంతయు విష్ణుభక్తి నడపును. ఆ స్వయంవరమున శైవవైష్ణవ, ద్వైతాద్వైతాది సకలమతాధిపతులును వత్తురు. వారినందరిని విష్ణుభక్తియే పరిచయము చేయును. ముక్తికాంత అద్వైతపతిని వరించును.
ఈతడు క్రీ.శ. 16వ శతాబ్దివాడగుటచేత జంటకవుల ప్రబోధచంద్రోదయమున లేని విశిష్టాద్వైతమును మాధ్వమతమును నిందు చేర్చినాడు.
అనుసరణలు
1. | అహంబ్రహ్మీభవించు | (1-76) |
ప్రబోధచంద్రోదయము
| "పరగ నప్పరమేశు | |
వివేకవిజయము
2. | నుదుటన్ ముక్కునఁ జెక్కులన్ జుబుకమందున్ గండపృష్ఠంబులన్ | (2-10) |
ప్రబోధచంద్రోదయము
| నొసటన్ ముక్కునఁ జెక్కులన్ బెదవియందున్ గండభాగంబులం | (పుట 75) |
వివేకవిజయము