ఈ పుట ఆమోదించబడ్డది
2
పల్నాటి చరిత్ర
పట్టభద్రులు పైడిపాటికివచ్చి
మేళ్లవాడుననిల్చె మించినదండు
కదనరంగంబున కార్యమపూడి
పుణ్యభూమినిజేరి పొందుగాదండు
అఖిలభూతములకు నాచారముగను
ఘనమైనపోతుల గావుచెల్లించి
[1]తరువాత సర్ఫాఖ్య తటినిలోపలను
పటుగంగధార నాబరగిన మడుగు
పొంతకుజని వీరపుంగవులెల్ల
నిలిపిరి లింగముల్ నేమంబు తోడ
§§§§ §§§§ §§§§ §§§§
[2] సహాయమునకై నలగామరాజు లేఖలుపంపిన కొందఱు రాజులు
మామగుండముకోట మనుజేశునకును
ధరణికోట పురికి దక్షుడైనట్టి
భీమదేవుండను పృథ్వీశునకును
ఉరగసేనుండను యుర్వీశునకున
పెదబాహుభూపతి భీమపేనులకు