పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

పద్మపురాణము


చ.

కనియె శ్రుతిస్మృతిప్రకరగాఢతరార్థవరిష్ఠు దివ్యబో
ధనపదవీమహత్వసముదగ్రగరిష్ఠుఁ దపోవిశేషసం
జనితనితాంతపుణ్యగణసంచయసువ్రతనిష్ఠు శేముషీ
జనితహితప్రభావమునిసంఘవరిష్ఠు వసిష్ఠు నయ్యెడన్.

129


వ.

కనుంగొని వినయంబున నమస్కరించిన నద్దిలీపభూపతి నాశీర్వ
దించి యాసనం బిడి యర్ఘ్యపాద్యాది విధులం బూజించి కుశలం
బడిగిన నమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.

130


చ.

అనఘ! భవత్ప్రసాదమున నారయ మాకు శుభంబయంచు న
మ్మునికి నమస్కరించి నృపముఖ్యుఁడు చేరి విఖానసోక్తు లె
ల్లను వినిపించి మీవలన లక్షణవంతములై తనర్ప నే
మును నృపధర్మకర్మములు మున్కొనివింటి నశేషతీర్థముల్.

131


వ.

మఱియు సకలధర్మంబులును సర్వవిధులును సమ్యక్ప్రకారంబున
విని కృతార్థుండనైతి నవ్వైఖానసుండు సెప్పిన యంత నుండి
యును మాఘస్నానఫలవిశేషంబులు విన నత్యంతకుతూహలం
బయ్యెడిని; దత్ప్రకారం బంతయు సవిస్తరంబుగా నాన తిమ్మని
వినయావనతవదనుండైన యా రాజునకు మునిరా జిట్లనియె.

132


సీ.

అవనీశ! నీవు న న్నడిగిన యర్థంబు
       పరమపవిత్రంబు పాపహరము
దానశీలురకుఁ గాంతారవాసులకును
       నతిథిభక్తులకును నందరాని
గతులఁ బొందించు లోకమున నేపుణ్యులు
       నమరసౌఖ్యముఁ గొంత యనుభవించి
మరలివత్తురు గాని మాఘమాసస్నాతు
       లగువారు నురలి రా రమృతపదముఁ