33
| పరమానురక్తి హృత్పద్మంబులందు | |
మడికి సింగన మూడవకృతి వాసిష్ఠరామాయణం. దీనికి మూలం వాల్మీకివిరచిత యోగవాసిష్ఠం. దీనికి జ్ఞానవాసిష్ఠ మని మరొకపేరు. వసిష్ఠుడు శ్రీరామునికి బోధించిన తత్త్వజ్ఞాన మిది. ఇందులో వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమన, నిర్వాణము లనే ఆరు ప్రకరణాలలో 32 వేల శ్లోకా లున్నవి. విశ్వతత్త్వాన్ని ఆకళించుకొని ఆత్మశాంతి పొందటానికి పరమసాధనమైన ఈ వాసిష్ఠరామాయణంలో ఆసక్తిదాయక మైన అనేక ఆఖ్యానా లున్నవి. ఇ దొకవిజ్ఞానశాస్త్రకోశం. ఆత్మజ్ఞానమూ ముక్తి కోరేవా రందరికి అవశ్యపఠనీయగ్రంథ మిది. మడికి సింగన ఆరు ప్రకరణాలను ఐదు ఆశ్వాసాలకృతిగా 1217 గద్యపద్యాలలో అనువదించినాడు. ఇందులో 39 ఆఖ్యానా లున్నవి. అహోబలనృసింహునికి అంకితమైన ఈ కృతి తెలుగువాఙ్మయంలో తొలివేదాంతకృతి. కవి ప్రతిజ్ఞలో—
క. | మృదుమధురరచనఁ గావ్యము | (I-14) |
క. | ఇది యల్పగ్రంథం బని | (I-15) |