పుట:పంచతంత్రి (భానుకవి).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వారు దివాంధులు మనము, వి
చారింప నిశాంధులము, నిశావేళ బలం
బారూఢమ్ముగ నొంచిరి
వారలు, దివమునను నొంపవలయును మనకున్.

21


క.

అని యిట్లు మంత్రులు హితం
బునఁ జెప్పిన నీతిమార్గము న్విని ధీమం
తుని ననఘు నాచిరంజీ
వినిఁ [గనుగొని] ప్రీతిఁ గాకవిభుఁ డిట్లనియెన్.

22


వ.

త్వద్బుద్ధిబలంబుపెంపునఁ గదా యివ్విభవం బనుభవింపఁగలిగె
నిప్పు డస్మత్కులోపభోగ్యంబగు రాజ్యం బరివశంబు గాకుండ నిలుపుమనిన,
నతం డిట్లనియె,—

23


గీ.

పరులకైతవంబు[వలన] నారంభమ్ము
లుడిగెనేనిఁ దలఁప్ర నొకటి కలదె!
[వివిధ]జీవరాశి విశ్వాసమున నమ్ము
కష్టవర్తనంబు గానలేదు.

24


చ.

అరయగ, మంత్రరక్షతగు, నాతతకైతవగూఢభావుఁడై
పరులకు నాప్తుఁ బోలి యనపాయ[గతిన్ హిత] మాచరింపుచున్,
బరుఁడుగ నొక్కవేళఁ దనవైర మణంచి [మెలంగ], బుద్ధి భా
స్వరుఁడయి యుంచు టొప్పు, గుణవార్నిధి! విఠ్ఠయలక్ష్మధీనిధీ!

25


వ.

అని యిట్లు చెప్పి యాచిరంజీవి యిట్లనియె దేవా! సామదాన
భేదదండమ్ములను నుపాయచతుష్టయమ్ముననుఁ, బ్రభుమంత్రోత్సాహం
బులను శక్తిత్రయంబువలనను, సంధివిగ్రహమానాసనద్వైధీసమాశ్రయం
బులను షడ్గుణంబులం దనరి, జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజమ్ములను షడ్గు
ణైశ్వర్యంబుల సంపన్నుండై, భూతభవిష్యద్వర్తమానంబులను నెఱింగి
[న భూపాలుండు] పరుల కభేద్యుండని వెండియు నిట్లనియె,—

26


క.

తనశక్తియుఁ బరుశక్తియు
మనమునఁ దలపోసి శిష్టమంత్రుల బుద్ధుల్