పుట:పంచతంత్రి (భానుకవి).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధర సజ్జనులకు ద్రవ్యము
పరికింపఁగఁ జెల్మి, శుద్ధభావంబున నొం
డొరుల ధనమెల్లఁ జూతురు
ఖరమాంసములట్ల, నెపుడు కరణిక లక్ష్మా!

34


వ.

అని తదుత్సవసమయంబున.

35


గీ.

స్వగృహసంగతుఁడయ్యు మూషకవిభుండు
వాయసమ్మును వీడ్కొనె వఱలు వేడ్క
నదియుఁ దనటెంకి కరిగి వనాంతరముల,
నఖిలమృగమాంసఖండమ్ము లరసి తెచ్చి.

36


చ.

తనచెలికాఁడు దానుఁ బ్రమదమ్మున మెక్కుచు సంతతోత్సవం
బునఁ జెలువంది యంత బలిభుక్ప్రవరుండును నాహిరణ్యకుం
గనుగొని, యీ ప్రదేశమునఁ గ్రవ్యములేదు శరీరపోషణం
బున కనఘాత్మ! కావలయుఁ బోయెద నెచ్చటికైన నిత్తఱిన్.

37


వ.

అని, యేతత్ప్రదేశంబు గడచి గవ్యూతిమాత్రంబు చనిన
నం దొక్కసరోవరంబు గల దందు మత్రియసఖుండు మంథరాభిధానుండగు
జరఠకమఠేంద్రుండు జలచరాహారమ్ముల నన్ను రక్షించు నే నచ్చటికిం
బోయెద, ననిన విని హిరణ్యకుం డిట్లనియె.

38


ఉ.

పాయఁగ లేను నిన్ను నను భద్ర! సరోవరమందుఁ గూర్పుమో
వాయస! యన్న చంచువుల వాని గ్రహించి చలమ్ము మీఱ, వై
హాయసవీథి నేఁగి కమలాకరమున్ బొడగాంచి వేడుకన్
వాయుచలత్తరంగచయవారికణమ్ముల, సేద దేఱఁగన్.

39


క.

అంతఁ బ్రియమ్మున మంథరుఁ
డెంతయు సంభ్రమముతోఁడ నేతెంచి, సరః
ప్రాంతమున నున్నవారల్,
సంతస మందించె నధికసత్కారములన్.

40


గీ.

అంత నీమూషికాగ్రణి, నాదరమునఁ
జంచువులఁ బూని విజనసంస్థానమైన