పుట:పంచతంత్రి (భానుకవి).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాదజలమ్ము గలుగు, రాకున్న, నీయంగుష్ఠమ్ము నా కిమ్మని దుర్బుద్ధిం జేసి
డాసి యప్పుడు.

288


క.

గురువుఁ బడఁద్రోసి చరణాం
బురుహము పెనువ్రేలు కోసి పుచ్చుక వేగో
ద్ధురతఁ జనియె, జనులును గని
యరుదందఁగ, ననుచుఁ జెప్పి యాతనితోఁడన్.

289


గీ.

అధికమగు దుష్కృతం బెవ్వఁ డాచరించు
నతడు, తత్ఫలమంతయు ననుభవించుఁ
దొల్లి తనయునిచేఁ దండ్రి ధూమసంచ
యమున మృత్యువు బొందె నటంచుఁ బలుక.

290


వ.

విని దమనకుం డది యెఱింగింపుమనినఁ గరటకుం డిట్లని చెప్పం
దొడంగె, ము న్నొకపురమ్మున ధర్మబుద్ధి దుష్టబుద్ధులను వైశ్యకుమారు
లిరువురు గలరు, వా రొక్కనాఁడు విత్తం బార్జించుకొఱకు నన్యదేశమ్ము
నకుం జని రందు,

291


సీ.

ధర్మబుద్ధి మహానిధానమ్ము గని దుష్ట
                    బుద్ధి కెఱింగించి యిద్ధనమ్ము
గొని యింటి కరుగుదమన, సమ్మతింప న
                    య్యిరువురుఁ దమయున్నపురము డాసి
తమచేతిధన మొక్కతరుసమీపమున ని
                    క్షేపించి యాత్మనికేతనములఁ
బొంది, మిత్రతఁ గడుపొలుపొంద నుండి, రం
                    దొకనాఁడు దుష్టబుద్ధికి నధర్మ
బుద్ధి పుట్ట, ధర్మబుద్ధికిఁ జెప్పక
యవపహరింతు ననుచు నాత్మఁ దలఁచి
యర్థరాత్రసమయమం దొక్కఁడును జని
యద్భుతంపుటర్థ మపహరించె.

292


గీ.

అద్దురాత్ముండు చిరకాల మరుగ, ధర్మ
బుద్ధిఁ బొడగని లేములఁ బొరయ నేల!
నేల దాఁచిన విత్తమ్ము నీవు నేనుఁ
బంచుకొందము నేఁ డని పలుక, నతఁడు.

293