పుట:పంచతంత్రి (భానుకవి).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున కిట్లనియె నిమ్మహీపాలు [నంతఃపుర కాసారంబునకుం జని] కనకభూష
ణం బపహరించి తావకాపకారియగు గోకర్ణకోటరమ్ములో వేయుమని
వీడుకొలిపిన నవ్వాయసవిభుండు.

166


క.

రాజగృహమ్మునకును జని
రాజచ్చట జలకమాడ రాగిల్లి మనో
రాజ? మగు పీటమీఁదను
రాజిల్లెడి కనకభూషరాజటు పెట్టన్.

167


క.

కని కాకము భూషణముం
గొనివచ్చి ఫణీంద్రుఁడున్న కోటరమధ్యం
బున వేయ దాని వెనువెం
టన వచ్చిరి రాజభటులు ఢాక దలిర్పన్.

168


వ.

వచ్చి తద్భూజంబుక్రింద నిలువంబడి.


గీ.

పాదపము నెక్కి యందలి పాము జంపి
కనకసూత్రమ్ము జేకొని చనిరి వేడ్క
కాకమిథునమ్ము [మది]ఁ గుతుకంబు నొందె
నట్లుగావున దగు నుపాయంబు వలయు.

169


క.

మతిమంతుఁడైన సౌఖ్య
స్థితినుండు నబుద్ధియైనఁ జెడిపోవును దు
ర్మతియై హరి, శశకముచే
మృతిఁబొందిన మాడ్కి... దలిర్పన్.

170


వ.

కరటకుం డాకథ యెఱింగింపు మన దమనకుం డిట్లనియె.


సీ.

కలఁ డొక్కవనమునఁ గంఠీరవేంద్రుఁడు
                    దర్పించి మృగములఁ దఱచు దినఁగ
మృగములన్నియు గూడి మృగకులాధిప యిట్లు
                    దిన నేల మాయందు దినము నొకని
భక్షింపదగునని పల్కిన నంగీకరించి
                    యారీతిఁ జరించుచుండ
నందొక్కనాఁడు శశాధీశు దినము వ
                    చ్చిన వాఁడు మదిలోనఁ జింతనొంది