పుట:పంచతంత్రి (భానుకవి).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనిన నాకథావృత్తాంతం బెట్లని కాకం బడిగిన జంబుకప్రభుం
డిట్లనియె.

161


సీ.

అనఘ లంబోదరుండను బకాధిపుఁ డొక్క
                    కొలనితటమ్మున నిలిచియున్న
[నడిగె] నందలి యెండ్రి యాహారశూన్యత
                    నిచట నింకనుఁ గార్య మేమి యనిన
నలమత్స్యములు మాకు నాహారములు గాన
                    నవి నేడు జాలరు లరుగుదెంచి
[కై]కొనిపోదు రెక్కడఁ జొత్తునని యిట్లు
                    [వనరుచు] నున్నాఁడ ననిన పలుకు


ఆ.

లాలకించి మీనులన్నియు నేతెంచి
యతని మమ్ముఁ బ్రోవుమనిన మిమ్ముఁ
గరుణతోఁడ నన్యకాసారములలోన
విడుతు బ్రతుకుఁడంత వేడ్క ననిన.

162


క.

ఆమాట నమ్మి ఝషములు
ప్రేమమ్మున నెచటనైనఁ బెట్టుమటన్నన్
దా మొఱఁగి తిగిచి క్రమమున
బామరపతి వానినెల్ల భక్షించినచోన్.

163


గీ.

ఎండ్రివిభుఁ డెఱింగి యిప్పుడు నన్నును
గొంచు నేగుమనినఁ, గొంగ యపుడు
పారివచ్చి తన్ను బట్ట కుళీరమాం
సార్ధి యగుచు దంభ మతిశయిల్ల.

164


వ.

అప్పు డతండు మనమ్మున నిట్లని వితర్కించె.


చ.

ఇది కపటప్రభావమున నేచి ఝషమ్ముల మ్రింగి నన్ను దు
ర్మదమునఁ బట్టి చంపు ననుమానము లే దిక విక్రమంబు చూ
పెదనని యంతరంగమున భీతి నెఱుంగక బల్మి కంఠమున్
వదలక కొండ్లఁబట్టి యమవాసము జేర్చె బకాధినాథునిన్.

165


వ.

అట్లు గావున హింసాపరులుం గార్యాంతరంబుల హతు లగుదు రనిన,
నతండు నిప్పు డుచితకార్యం బెఱింగింపుమనిన వెండియు నప్ఫేరవపతి కాకం