పుట:పంచతంత్రి (భానుకవి).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అమ్మహానగరమ్మున కధీశ్వరుండగు సుదర్శనుండు.

46


సీ.

తనదృష్టి యష్టదిగ్దళమహీమండల
                    పద్మాంతరస్థమై పరగుచుండ
తన రూప మంగనాజనమానసములకుఁ
                    బంచశిలీముఖభ్రాంతిఁ జేయ
తన కీర్తిసతి జగత్రయరమణీయసౌ
                    ధాభ్యంతరమ్ముల నాడుచుండ
[తన ప్రతాపాగ్ని శాత్రవకానన నమ్ముల]
                    పై, ననారతమునుఁ బ్రజ్జ్వలింప


గీ.

గంధగజగోత్రభూమిభృత్కచ్ఛపాహి
పాల [కిటిరాట్]ధురంధరబాహుభీమ
శక్తి సంపదఁ బెంపొంద, సత్యనిరతిఁ
బొలిచె ముందటిరాజులఁ బోలి యతఁడు.

47


వ.

అంత నమ్మహీవల్లభుం డొక్కనాఁడు సమస్తవిద్యావిధిజ్ఞులగు
తిథిజ్ఞులును నధికతరప్రబంధనిస్తంద్రులగు కవీంద్రులును, అఖిలపురాణపారీ
ణులగు పౌరాణికులును పరరాజరాష్ట్రవిభేదననీతితంత్రజ్ఞులగు మంత్రు
లును, నిజకృపాపాత్రులగు నుత్తమక్షత్రియులుసు, గొలువం బేరోలగం
బుండి తన కుమారులు నీతిశాస్త్రపారంగతులు గాకుండుటకు హృదయం
బున విషాదంబు నొంది సభాజనమ్ములు విన నిట్లనియె.

48


చ.

అలఘుకళావివేకవిభవాదులఁ బెంపగు సూనుఁ డేక్రియన్
గలుఁగడ యేని, భార్యఁ దన కౌఁగిలి జేర్పకయుంట మేలు ము
న్నలిగి ఋతుప్రసంగతుల నంటక యుండిన మేలు, గర్భమై
పొలిసిన, వంధ్యయై, రమణి పుట్టిన మేలు ధరాతలమ్మునన్.

49


క.

ఘనవిద్వాంసుఁడు ధార్మికుఁ
డును గాకుండినఁ దనూజుఁడు ధరిత్రిన్ గ
ట్టని పిదుకని మొదవుం బో
లినవాఁ డరయంగ సూక్ష్మలిఖితాచార్యా!

50