పుట:పంచతంత్రి (భానుకవి).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


య్యంబుజనేత్ర విద్యలకు నాకర మయ్యెడి దేవి భారతిన్
గంబుసమానకంఠి నధికంబుగఁ గొల్చెదఁ గార్యసిద్ధికిన్.

7


వ.

అని యివ్విధమ్మున నిష్టదేవతాప్రార్ధనమ్ము చేసి,

8


గీ.

అఖిలజనులకు రామకథామృతమ్ము
గలుగఁ బ్రవహింపఁజేసిన కవివరేణ్యు
సుభగచారిత్రు మునిజనస్తోత్రపాత్రు
నేకమనమునఁ గొల్తు వాల్మీకి నెపుడు.

9


క.

భారతవాగ్భణితులను న
నారతకలికలుషతిమిర మణఁగించుచు వి
ద్యారూఢి నవనిఁ దనరిన
పారాశర్యుని నుతింతుఁ బరమప్రీతిన్.

10


సీ.

కావ్యత్రయము నాటకంబులు రచియించి
                    ఘనకీర్తి నొందిన కాళిదాసు
(నహరీశహ)రుల విద్యలచేత మెప్పించి
                    యుర్విఁ బేర్గనిన మయూరు బాణుఁ
దెలుఁగునఁ బాండవేయుల కథఁ గూర్చి పెం
                    పెక్కిన నన్నయఁ దిక్కనార్యు
భాగవతమ్ము నా పద్ధతి గావించి
                    పొలుపొందు బమ్మెర పోతరాజుఁ
జతురు శ్రీనాథు భాస్కరు శంభుదాసు
రంగనాథుని ఘను నాచిరాజు సోముఁ
దలంచి తక్కినకవుల ముదమునఁ బొగడి
కరముఁ బెంపొంద వారల కరుణ వడసి.

11


వ.

ఏ నొక్కప్రబంధమ్ము నిర్మింపంగోరి పురాతనకవీంద్రులచేత
మున్నఖిలమ్ము రచింపంబడె నాకు నిప్పు డెయ్యది గలుగునో యని విచారిం
పుచునున్న యవసరమ్మున.

12


సీ.

తనయరు లఖిలగోత్రక్షమాధరతట.
                    స్థానమ్ముల ననారతమ్ము దిరుగ