పుట:పంచతంత్రి (భానుకవి).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధరణీసురుఁ డచ్చటి యా
నరపతి కెఱిఁగింప, నతఁడు నక్కలవన్నీ
స్థిరమతి నేవని! యడిగిన
శరనిధి కాలంగ నార్పఁ జనిరని చెప్పెన్.

75


వ.

ఇట్లు వృద్ధజంబుకంబు చెప్పిన రాజు విని యెచ్చటనైనను సము
ద్రంబు గాలం జొచ్చునే! యందులకు నక్క లార్పం జనునే యని నవ్విన, నా
గోమాయు వెక్కడనైనను గుఱ్ఱమ్ము లావుల నీనునే! యని ప్రతివాక్యమ్ము
లాడి, నరనాథా! అశ్వరక్షకులు దుర్బుద్ధు లట్టివారలభాషణమ్ములు విని
నీవును విప్రునిగోవు నపహరించితి వనిన, విని యాభూపతి యాగ్రహమ్మునఁ
దననగరిజాగిలమ్ములచే జంబుకంబు విదళింపంబంచిన, నదియును నా సన్న
యెఱిఁగి కాననమ్మున కరిగె మఱియును,—

76


క.

తదనంతరమున బ్రాహ్మణుఁ
డుదితుండై యావు నడుగ నొప్పుగ వాని
న్నదయుండై బంధించిన,
మదయుతుఁడై శాప మిచ్చె మహిపతి వొలియన్.

77


ఆ.

మొనసి బ్రహ్మతేజమున రాజు వొలియించి
ప్రజ్వరిల్లుచున్న బ్రాహ్మణునిని,
రాజ మంత్రివరులు రప్పించి విడిపించి,
యావు నిచ్చి పంప, నరిగె నతఁడు.

78


వ.

ఇట్లు విప్రుండు ధేనువుం జేకొని సుఖం బుండెనని బలవర్ధనుండు
తనసుతున కెఱింగించిన కథ, విష్ణుశర్మ నృపనందనుల కెఱింగించె నంత,—

79


మ.

సతతప్రాభవకృష్ణరాయధరణీచక్రేశకారుణ్యవ
ర్ధితలక్ష్మీవిలసన్నిశాంత! సకలార్ధివ్రాతసస్యావళీ
హితహస్తాంబుద! మేరుధీరకుహనా.................
హతిపద్మాప్త! సమగ్రధీరగుణవిఖ్యాతాఖిలాశాంతరా!

80