పుట:పంచతంత్రి (భానుకవి).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నొక్కవిటుండును నక్కమలాయతా
                    క్షినిఁ గూడి మోహమ్ము [1]కొమరు మిగిలి
పగలు రేయను భేద మేర్పరుపలేక
దానిపసలను దగిలి నిత్యంబు నొకఁడు
మదనకదనమ్ములోపల సదమదముగ
మునిఁగి పోరాడుచుండ నామోహనాంగి.

64


వ.

ఆభుజంగపుంగవున కేలుబడియై యితరవిటుల నొల్లక, యవ్వేశ్య
తనకుఁ గలిగిన సకలపదార్ధమ్ములు నతనికి నెదురువెట్టఁ, దన్మాత యంతయుం
గనుంగొని యసహ్యంబునఁ గూఁతున కిట్లనియె,—

65


ఆ.

కొమ్మ! నూఱుమాళ్లు గో రొక్కనాఁటనే
తెచ్చుదాన వీవు తెలివి బెగడి
ముసలి ముందటికిని మొగ్గితి వయ్యయో
వీని విడిచి సుఖము వెలయఁగనుము.

66


వ.

అని చెప్పిన తల్లిమాటలు కూఁతురు సరకుగొనకయున్నఁ, దదంబ రా
పట్టిం జేకొని, దీని వెఱ్ఱిఁ గొని వీనిం గీటునం బొరిగొనవలయునని, యుద్యోగిం
చిన, నావగ్గుపల్కు లాభుజంగుం డాకర్ణించి వేశ్య యెఱుంగకుండ, నొక్క
సర్పశవంబుఁ దెచ్చి నిద్రించుచున్న లంజతల్లి వక్త్రరంధ్రమ్ములోఁ దల
వెట్టి తద్భోగంబు సాఁగిల విడిచియున్న సమయమ్మున — తదనంతరంబ,—

67


ఆ.

వేశ్య తల్లిఁ జూచి వేఁదుఱి విటునితోఁ
బాము గల దటంచుఁ బయి ననంగఁ
నతఁడు ముసల మెత్తి యాముదుసలిమీఁద
మొత్తె గ్రుడ్లు వెళ్లి ముండ ౘావ.

68


వ.

ఇట్లు విరోధియగు వేశ్యాంబను విటుండు వధించి ప్రియురాలిం
జూచి సఖీ! సర్పము విదళించితి భవన్మాతయు సర్పమ్ముతోఁ గూడ నిరయ
మ్మున కరిగెనని చెప్పిన, నావేశ్యయుఁ బ్రలాపించి భుజంగునిఁ గూడి సుఖం
బుండెనని జనకునితో పుత్రుఁడు చెప్పిన విని యావానరుం డిట్లనియె.—

69
  1. యతిభంగము