| కరునిఁ గళంకమట్లు నధికంబుగ దుర్దశ లుర్విలోన స | |
—భానయ
చ. | లలితపటీరపాదపములన్ జిలువల్ గమలోజ్జ్వలజ్జల | |
—వేంకటనాథుఁడు
చ. | మలయజశీతలమ్ములగు మాటలఁ దేల్చును వచ్చినంతఁ బెం | |
—భానయ
మ. | పురతఃప్రాంజలి, సాశ్రుదృగ్జలజుఁ డుత్ఫల్లాస్యుఁ డాశ్లేషణా | |
—వేంకటనాథుఁడు
ఈ యుదాహరణములవలనఁ దుల్యవిషయములపై జాలువాఱిన యీ మువ్వురు కవుల వాణీమార్గములలోని భేదములును దేటపడుచున్నవి. సరళమధురవిధురగమనములగు నీ మూఁడు కవితాప్రవాహములును నేకవిషయమున సంగమించి, గంభీరమగు నీతిశాస్త్రతీర్థమునఁ దెనుఁగుప్రజకు సులభావగాహసౌఖ్యమును బ్రసాదించినవి.
ఈమువ్వురు కవులును మూలములోని కథల నన్నింటిని యథాతథముగఁ గైకొని తెనిఁగించినవారు కారు. పెక్కు కథలను విడిచిరి. కొన్ని కథలను మూలభిన్నముగ నిర్వహించిరి. ఏయే కథలను విడిచిరో, ఏయే కథల నిర్వహణమునందు భిన్నమార్గముల నవలంబించిరో, యిచ్చట నిరూపించుట కవకాశము