పుట:పంచతంత్రి (భానుకవి).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అందుఁ దరుకోటరమ్మున ననఘమతి క
పింజలమ్ముండు నాతోఁడఁ బ్రియము కలిగి,
అస్తమానా?వసరమున నరిగె నొక్క
నాఁడు నెందేని, మేతకై పోడిమిగను.

54


వ.

తదవసరంబున,—

55


సీ.

ఆకోటరమ్మున నప్పుడు దీర్ఘక
                    ర్ణుండను శశకవిభుండు నిల్చి
కొంతకాలం బుండ, నంత కపింజలుం
                    డేతెంచి నానెల వెవ్వఁ డిపుడు
గైకొన్నవాఁ డనఁ, గైకొన కాతఁ డి
                    ట్లను, నున్నవారిదే యరయ నెలవు.
ఎవ్వఁడు మున్నుండె నివ్వటిలంగను
                    వానిదే నెలవని, వాదులాడఁ
గని నేను వారలఁ గడకుఁ బోఁద్రొబ్బియుఁ
                    దగవుకు బొండని ద్వయము గూర్చి


గీ.

ప్రీతి నేఁగితి నపు డాకపింజలుండు
న్యాయ్య మిరువురకును దెలియంగఁ జెప్పు
నతని నెఱుఁగవె! నీ వని యడుగుటయును,
బరమసంతోషుఁడై వాఁడు పలికెఁ దెలియ.

56


వ.

యమునాతీరమ్మున నతిధార్మికుండను నొక్కవృద్ధమార్జాల
విభుండు గలం, డతండు మనకు ధర్మమార్గం బెఱింగించునని దీర్ఘకర్ణుండు పలి
కినం, గపింజలుం డిట్లనియె. వాఁ డల్పజాతి మనకు విశ్వసింపవచ్చునే! యన
వాఁడిట్లనియె.

57


గీ.

అతని మనకేల డాయంగ మతిఁదలంప
న్యాయమార్గమ్ము దెలిసి సన్మాన మొప్ప
మగుడి చనుదెంత మనినఁ దన్మానసమున
నాతఁ డిరువురకును సమం బని యెఱింగి,—

58