పుట:పంచతంత్రి (భానుకవి).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధంబంత నెఱిఁగింపఁదగునన్న నాతఁ డి
                    ట్లని చెప్పె, ము న్నొక్కవనమునందు
దంతులు ద్వాదశాబ్దంబు లనావృష్టి
                    యైనను, జలము లే కాత్మఁ గలఁగి,


గీ.

ద్విరదవిభుఁ జూచి పల్కె నో దేవ! చండ
కిరణుతాపమ్ము మేనును గ్లేశపరుప
...............................................
................................................

37


క.

కరివల్లభుఁ డంబుసరో
వరముల హ్రదములను వెదుక, వడిగల మత్త
ద్విరదమ్ములఁ బంచె దిగం
తరముల నవి చూచి వచ్చి, తమపతి యెదుటన్.

38


వ.

నిలిచి, యిట్లని విన్నవించె,—

39


చ.

కరిపతి! నీవు పంపఁ జని కంటిమి చంద్రసరోవరమ్ముఁ, బ్ర
స్ఫురదురుశంఖచక్రములఁ బొల్చి పయోరుహలక్ష్మి నెంతయున్
సురుచిరమై జనార్దనుతనుక్రియ నెప్పుడు మీఱుదానిఁ బు
ష్కరయుతమైనదాని, జలజంతుతతిన్ దగుదాని, నొక్కచోన్.

40


వ.

అని చెప్పిన విని, యతులితంబగు సంభ్రమంబునఁ దత్ప్రదేశమ్ము వాసి.

41


శా.

ఆనాగేంద్రుఁడు సంతస మ్మొదవ నుద్యత్కాలమేఘాకృతిన్
దానాంభఃకణసంచయమ్ము వడియన్, దంతావళశ్రేణితో
నానాభూజములెల్ల వ్రాల, శశసంతానమ్ము వైవస్వత
స్థానం బుద్ధతిఁ జేరబో, నడచెఁ జంచద్వేగసంరంభియై.

42


వ.

అయ్యవసరమ్మున శిలీముఖనామధేయుం డగు శశకవల్లభుండు
నిజప్రధానవర్గమ్ము నవలోకించి, వారణసందోహం బనవరతమ్మును జలాభి
లాష నన్యసరోవరమ్ములకు నడువ మనబలఁగంబెల్లఁ బొలియందొడంగె,
మనకుం జేయునది యెఱింగింపుఁడన, నందు బహువృత్తాంతవిదుండగు వృద్ధ
మంత్రి విజయుం డనువాఁ డిట్లనియె,—

43