పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చోరుఁడె దుష్టబుద్ధి యతిశుద్ధుఁడుగా కని భూరుహంబుచేఁ
బౌరులు గుంపులై విన సభం బలికించెదనంటి వచ్చితిన్
జేరెడుమాటమాత్రమునఁ జేకొను మస్మదభీప్సితంపుదీ
నారసహస్ర మెప్పటికి నందనులాభము తండ్రిఁ బొందదే.

734


క.

తరుకోటరమున నీ వొ, క్కరుఁడవ వసియింపు మొరులు కనుఁగొనకుండం
బరిషజ్జనము రయంబున, నరుదెంచినఁ బలుకు సభ్యుఁ డని ని న్నడుగన్.

735


వ.

అనినం గొడుకునకుఁ దండ్రి యిట్లనియె.

736


క.

చెడుబుద్ధి నీకుఁ బుట్టెం, జెడితివి నన్నుం గృతఘ్న చెఱిచెదె యూఁకో
నొడఁబాటు గాదు చిత్తము, వెడఁగులపని పంపుసేయువీఱిఁడి గలఁడే.

737


క.

మొదల నపాయం బెన్నుట, పిదప నుపాయంబు లెక్కపెట్టుట తగు నీ
చిద గొదలఁ గాదె ము న్నొక, ముదికొక్కెర యనుఁగుసుతుల ముంగిస కిచ్చెన్.

738


గీ.

అనిన దుష్టబుద్ధి జనకు నిరీక్షించి, యిట్టు లనియె నకుల మేకతమున
బకపికార్భకముల భక్షించె బక మేమి, సేసె నంతవట్టుఁ జెప్పవలయు.

739


వ.

అని యడిగినఁ దండ్రి కొడుకున కి ట్లనియె.

740


మ.

కల దభ్రంకషభూజరాజిశుకపాకగ్రస్తశస్తస్వరు
త్పదృగ్వావ్యము కూలముద్రుజఝరీభంగాంగసంఘర్షజా
విలఘోషప్రతిఘోషితద్విరదవిద్విడ్భీమ ముగ్రద్విపి
స్థలకృత్కీలదరీనికాయ మొకకాంతారంబు దుర్వారమై.

741


ఉ.

ఆవిపినంబునం దొకమహామహిజంబున నగ్రశాఖపైఁ
దా వసియించి యొక్కబకదంపతి పిల్లలఁ జేయుఁ జేయ నా
శీవిష మాసమీపబిలసీమమున న్వసియించియుండి వా
పోవఁగ నన్నిటి న్మెసవిసోవు సమాసమ నివ్విధంబునన్.

742


క.

ప్రతిసంవత్సరమును నీ, గతిఁ బిల్లలఁ బాముపాలు గావించి మనో
గతి బకమిథునము పొగులుం, బ్రతికృతిఁ గానక యలంతఁ బగలు న్రేలున్.

743


వ.

అట్లుండఁ గొండొకకాలంబునకుఁ దననాతికిఁ బ్రసూతిసమయం బగుటయు భుజ
గభయానకం బగుబకంబు తికమెకంబై సంతతిసంభరణంబునకు విరోధిసంహరణం
బుసకు నుపాయంబుఁ గానక తానకంబుఁ బాసి ప్రియసఖుండు నాపజ్జయాభి
ముఖుండును నగుకర్తరీపాణినామకుళీరకుం జేరంబోయి కాయం బడచిపడ బుడి
బుడికన్నీరు గ్రుక్కుచుఁ జిక్కుకొన్నకంఠంబునఁ దనకుఁ బాటిలినచేటుపాటు
ప్రసంగించి శోకించి పుత్రత్రాణవిధేయం బగునుపాయఁబుఁ జెప్పి యాపత్పారా