పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కాననవాసియైనను సుఖంబు విశిష్టగృహాన్నభిక్షకుం
డైనవరంబు లూఖలకణాశనుఁడైన శుభంబు కర్షకుం
డైనను మేలు నీటజఠరానల మార్చుట లెస్స చూవె స
న్మానకరుండుగాని నరనాథు భజించుటకన్న నేరికిన్.

432


చ.

మడఁగిపడుండఁ బ్రానులకమంచపుఁగుక్కికి నిల్వుఱెల్లుపు
ల్గుడిసెకు నొండు రెండెనుపగొడ్లకు నోరికిఁ బోఁక ప్రక్కకున్
గుడువఁగఁ గూటికి న్మొలకు గోకకు సీదిర మెంతరోఁత యే
వడువున దుష్ప్రభుం గొలువవచ్చు నిసీ యను జీవికోటికిన్.

433


చ.

పలికినమాట నిల్వఁ డెడపందడపం జెడనాడు వచ్చు మె
చ్చుల దిగమ్రింగుఁ దొల్దొలుతఁ జూచినచూపులఁ జూడఁ డేర్పడం
జులుకదనం బొనర్చు నెరసు ల్ఘటియించు లదల్చివైచుఁ గే
వలనృపసంశ్రయంబు పగవారలకు న్వల దివ్వసుంధరన్.

434


మ.

హతదాక్షిణ్యు లనర్థకారు లభిమానాధ్యాత్ము లవ్యంజన
ప్రతిపక్ష ల్గుజనప్రియంవదులు సంపత్సన్నిపాతస్మృతి
క్షతికు ల్సత్యపరాఙ్ముఖు ల్ధనపిశాచగ్రస్తు లాద్యావన
చ్యుతు లక్షాంతు లనాంతరంగికులు రాజుల్ గారె యూహింపఁగాన్.

435


క.

చుట్టము లెవ్వరు దేశం, బెట్టిది యాయువ్రజంబు లెట్టివి కాలం
బెట్టిది యే నెట్టిడ బల, మెట్టిది నాకని తలంపుమీ నీ వనినన్.

436


వ.

దమనకు నాలోకించి సంజీవకుం డను ననుజీవులకు దుష్ప్రభుసంశ్రయంబు గాదని
యును దేశకాలంబులు విచారింపవలయుననియును నన్యాపదేశవర్ణనాసందర్భం
బుగా నంటి విమ్మాటలకు నిమిత్త మేమియొకో యని యూరకుండిన వెండియు
దమనకుం డిట్లనియె.

437


ఉ.

నావచనం బమోఘమని నమ్మి దురూహలత్రోవఁ బోక సం
జీవక యేగుదెంచితివి సింహముఖంబున కెట్లు భద్రసం
భావన సేయుదుం గద విపద్దశ లొత్తినచోట నోర్వ నా
హా విభుఁ డీరసించెనుగదయ్య నిమిత్తములేమి నీపయిన్.

438


క.

సరసవినీతరసానీ, తరసము విరసత నగల్చి తనసుభటపరం
పర కిత్తు ననియె బతి యె, వ్వరు ది క్కిఁక నీతు లున్నవా రాజులకున్.

439


క.

పరివారము దూరి వసుం, ధర నిడి వడిఁ దెల్పె నేకతంబున నన్నున్
ద్విరదారి చీరి చిత్తం, బెరియంగాఁ బిడుగువంటి యీదుర్వార్తన్.

440