పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జెనటిపతి చోదకోర్వక, చని రాజ్యము మంత్రికైవసముఁ గావించున్.

382


క.

సిరిఁ బరిహరించునరు లె, వ్వరు చెపుమా పిచ్చుకుంటునాడుంబలె హో
దరుఁ డాదిగ నృపసంశ్రయ, గరిత న్సంపదలఁ బొదలఁ గాంక్షింతు రిలన్.

383


వ.

సత్పురుషులమతి నతిక్రమించి యసత్పురుషుల బుద్ధిం బ్రవర్తించురాజు విను మప
థ్యానురాగియగు రోగియుంబోలెఁ బ్రాణభరణసమర్థుండు గాఁడు స్వబుద్ధి రాజులకు
విశేషించి వలయు బుద్ధిరాహిత్యంబునగు మంత్రివశుండై తిరిగెనేని యారాజు
విరోధనిరోధితుం డగు నట్లగుట హితతంత్రియగు మంత్రివాక్యంబులు రాజునకు నవ
శ్యకర్తవ్యంబులు వినునప్పు డప్రియంబులు పరిణామంబునం బ్రియంబులు నగు
వాని నుపదేశించు మంత్రియు నవ్వాక్యంబు లాదరించు రాజునుం గలుగఁడు కలిగె
నేని యద్దిక్కునఁ బెక్కువచెడక సిరులు పెరుగుచుండు.

384


క.

ఘనుఁ డాప్తుఁడు నగుసచివుఁడు, వినిపించిన రాజనీతి వేయేటికి రు
గ్ణునకుఁ జికిత్సాక్రియవలె, మును వెగటుం బిదప హృద్యమును నై యుండున్.

385


క.

నరపతి మూలబలంబుల, తెరు వొల్లక నడుమ నరుగుదెంచినవారం
బరిపాలించుటకంటెను, గరివైరీ యొండుచేటు గలదే పుడమిన్.

386


క.

మూలబలంబులుగల భూ, పాలునకు నరాతిజాతి భయపడు లక్ష్మీ
భూలావణ్యవతుల్ హరిఁ, బోలె న్బెడఁబాయ రవ్విభుని ననుదినమున్.

387


క.

తా నెంతశూరుఁ డయినను, భూనాథుఁడు మూలబలము పొందొల్లక ని
ర్మానపరిపంథినరవర, సేనాపారంపరీవిజేత యగునొకో.

388


ఉ.

జీవిత మిచ్చి యాదరముఁ జేసి జలౌదనసంవిభాగసం
భావనకల్మి నేధరణిపాలుఁడు భృత్యులఁ బ్రోచు నద్ధరి
త్రీవిభు ప్రస్తుతంబున శరీర మలక్ష్యముఁగా దలంచుచున్
జీవిత మిచ్చు గాయములచేఁ బడునొండె భటుం డుదగ్రతన్.

389


క.

పరిజనగౌరవము ధరా, వరునకు నత్యంతగౌరవము వెండియు న
ప్పరిజనలాఘవము ధరా, వరునకు నత్యంతలాఘవము సు మ్మెందున్.

390


వ.

నీవు మూలబలంబులం దిరస్కరించి యభినవాగతులం బురస్కరించుకొన్నాఁడవు.

391


క.

సేవకుఁ డని చూడకు సం, జీవకుని న్నతఁడు సరకుసేయఁడు రాజ్యం
బేవేళ నతనిపాలయి, పోవునొ దుది నెంతకొఱఁత పుట్టునొ నీకున్.

392


క.

నావిని పింగళకుఁడ నయ, కోవిదు దమనకునిఁ బలికెఁ గూరిమి నభయం
బీ విప్పింపఁగ నిచ్చితి, నావిధ మతఁ డేల మఱచు నది యెట్టు లగున్.

393


వ.

అనిన దమనకుండు.

394