పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

బడలికఁ బాసినఁ దిరుగం, బడి ప్రాణసమానులైనబంధుల మిము న
మ్మడుగునఁ జేర్చిదనని యొడఁ, బడఁ జెప్పుం దనకు నరుగఁ బాఱినదనుకన్.

317


క.

తనివి సన నిట్లు కతిపయ, దినముల కుదరానలంబు దీఱ న్మాయా
ఖని యాబడుగుంగొక్కెర, యనఘా యాటెంకిమీల నన్నిటి మెసవెన్.

318


వ.

ఇట్లు నిరవశేషంబుగా మీనంబులం దిని యెందేనియుం బోవ సుద్యోగించు నజ్జరఠ
బకంబున కెఱుకఁజేసికొని మున్నెఱింగించుకొన్నకుళీరం బిట్లనియె.

319


గీ.

భావికైవర్తకత్రాసభగ్నమాన, మానముల మీనముల నొండుమడుగుఁ చేర్చి
సుకృతసామ్రాజ్యవిభవంబు చూఱఁగొంటి, బకపురందర కలఁడె నీవంటిధర్మి.

320


క.

నాళీజంఘాదులు నినుఁ, బోలరు పరహితవివాసమునఁ జుట్టములం
బాలించి నన్ను నేలా, పాలింపవు సఖుఁడఁ గానె పగవాఁడనొకో.

321


వ.

జలస్థలాంతరంబునుం జేర్చి పొగడ్తఁ గనుమని కైవారంబు సేయు కుళీరంబు నిరీ
క్షించి కర్కటమాంసం బపూర్వం బదియుఁ జవిచూడవలయు నని విచారించి
యక్కొక్కెర దానం గఱుచుకొని వధ్యశిలాతలంబునకుం బోయి భక్షింపఁ దివురు
టయు నయ్యుద్యోగం బెఱింగి యయ్యెండ్రి.

322


చ.

బలిమి హుటాహుటిం దఱిమి పట్టుకొన న్వడిలేక మాయపుం
దలఁపున రిత్తజాలరులదాడి గడించి ఝషంబుల న్నిరా
కులగతి మెక్కని మ్ముసలికొక్కెర యన్యజలాశయంబునం
గలుపుమిషంబునం జనదుగా కపటాత్ముల విశ్వసింపఁగన్.

323


క.

మేసినసమయంబున ధృతిఁ, బాసినమది కార్యహానిఁ బ్రాణుల నిలుగన్
వ్రాసె విధి మృతికి నేలా, గాసిలి పౌరుషము విడువఁగా నేమిటికిన్.

324


క.

పరుషకరపత్రధారా, స్ఫురణఁ బ్రకాశించు మద్విపులదంష్ట్రికలన్
శిర ముత్తరించి పాథ, శ్చరములకొలఁదీర్తు నీరసంబున ననుచున్.

325


క.

అక్కర్కటముండఁగ నల, కొక్కెర దత్తరస మొలిచికొని తినునదియై
ముక్కెత్తిచాఁచు నాలో, నొక్కూఁకునఁ గొండ్లనిఱికి యొత్తెన్ గళమున్.

326


క.

ఒత్తిన సుమడుండుభుకము, కత్తెరచేఁ దునియుమాడ్కిఁ గర్కటదంష్ట్రా
కృత్తగళంబై నెత్తురు, జొత్తిల నల వృద్ధబకము సోలె న్గూలెన్.

327


క.

రోయక ప్రాణుల కపకృతి, సేయుదురాచారుఁ డిట్లు చేట్పడు విను మో
వాయసవల్లభ శిశురిపు, వాయుభుజుం డీల్గు నిట్టివాఁడై యునికిన్.

328


మ.

భవదర్భాహితకృష్ణసర్పహరణోపాయం బెఱింగింతు నీ
వవధానంబునఁ జేయు మేమఱక రాజాగారసంచారివై