పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అని యశ్రుమిశ్రితాంబకం బై బకంబు వగచిన విషంబునంగల ఝషంబు లన్నియు
నెఱుక చేసికొని యక్కొక్కర కిట్లనియె.

303


ఉ.

ఆరయ మీనభక్షకుఁడ వయ్యును గూరిమి పెద్ద మాయెడం
గారుణికాగ్రగణ్య యటుగావున విప్రతిపత్తిలేదు ని
చ్చో రయమార మమ్ము నొకచొప్పున దుస్థితి నొందకుండ నీ
డేరుపుమయ్య సేమము ఘటింపగదయ్య ప్రసన్నమూర్తివై.

304


వ.

అని మీనంబులు దన్నుం బ్రార్థించిన సత్సుకంబయి బకంబు తనలోన.

305


క.

యీయంబుచారములు దన, మాయకు లోనయ్యెఁ గంటి మన సని సంతో
షయతి నంతర్లీనముఁ, జేయుచు మాయాకళారసికమది పలికెన్.

306


క.

వాదించి జాలరులనౌఁ, గాదన నా చేతఁగాదుగద నిజవృత్తి
ఛ్ఛేదమునకు నోరుచుకొన, రాదేకద పరమదుష్కరమ కద పూనన్.

307


క.

ఐన నిఁక నేమి సేయుద, మే నొకఁ డెఱిఁగింతుఁ జేయుఁ డిష్టంబైనన్
మీనముల నితరసలిల, స్థానములను బెట్టివచ్చెదను మిముఁ గరుణన్.

308


క.

రావలసిన రారండని, భావంబున లేనికరుణ పరిఢవిలంగా
నావృద్ధబకము పలికిన, జీవనచారములు విశ్వసించినమదితోన్.

309


క.

చేటెఱుఁగనికూనలు మీ, లాటోపము మీఱఁ జేరనరిగిన నిశిత
త్రోటి నొకఝషముఁ గొని యొక, చోటికిం జని మ్రింగి వగచుచుం గ్రమ్మఱియెన్.

310


వ.

ఇట్లు క్రమ్మరి.


క.

రారం డిఁక నొకరని రా, జీరి యొకానొకఝషంబు శితచంచువునన్
గూరిచిచని మును మెసవిన, చో రూపఱ మెసవి తొంటిచొప్పున మఱలన్.

311


క.

మగిడివిరివియును లోతున్, దిగియుం గలనీట విడిచి తీఁగొన్నిటి న
క్కగములు దన్నెన్ మృత్యువు, మొగము న్నో రుత్తమాంగమును డాఁకాలన్.

312


క.

మీకును మృత్యుత్రాసము, లేకుండం జేయనేర్తు లేలెండని రా
నాకొక్కెర యొకమీనముఁ, గైకొని చని తిని సరోముఖమునకు వచ్చున్.

313


క.

ఎడతాఁకితాకి యొండొక, మడువున నిడు కైతవమున మఱియు న్మఱియున్
బడుగుంగొక్కెర మీలం, గడుపార న్మెసవి తృప్తిఁ గైకొని యంతన్.

314


వ.

సరోవరతీరంబునం గా ల్నిలిచి వాంఛితపరనీరస్థానంబు లగుమీనంబులం గదిసి
యిట్లనియె.

315


గీ.

అరిగి తిరిగి నేఁటి కలసితి భరమాన, వసమె మూఁడుగాళ్లముసళి గానె
కండవడొయొ వయసొ గర్వమో సంచార, శక్తి ముదుక కెట్లు సంభవించు.

316