పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సేతఁ బరిగ్రహించి యతిశిష్యునిచే నొకనేఁతకానిచే
దూతిక నొచ్చె నాత్మకృతదోషమున న్గద నావు డుల్లస
క్కౌతుకవల్లి పల్లటిలఁగా నతఁ డాతనిఁ జూచి యిట్లనున్.

214


క.

అది యెట్లు విస్తరింపం, గదె యాకర్ణింతు సకలగాథాబోధా
స్పదహృదయ యనుడు వికస, ద్వదనుండై కరటకునకు దమనకుఁ డనియెన్.

215


క.

యువనాశ్వనగరమునఁ గే, శవశర్మ యనఁగ నొక్కసన్యాసి మఠం
బవలంబించి యశిష్య, ప్రవరుండై యుండె భైక్ష్యభక్షకుఁ డగుచున్.

216


క.

కల దాసన్యాసికి బహు, కలధౌతసువర్ణపూర్ణకంధస దాయ
బ్బలుగుయతి మరపు మోసము, గలనేనియు లేక దానిఁ గని రక్షించున్.

217


తే.

స్నాన మొనరించునప్పుడు జపము సేయు, నపుడు కఠపాత్రమున భిక్ష మడుగునపుడు
పండునపుడును బొంతపై నుండు మనసు, బీదగఱచినబూరె యబ్భిక్షునకును.

218


క.

చిరకాల మివ్విధంబున, నరిగిన నాషాడభూతి యను ధూర్తధరా
మరసుతుఁడు సేరి కంధా, హరణేచ్ఛ న్యతికి శిష్యుఁడై సేవించెన్.

219


ఉ.

ఆయతి యొక్కనాఁ డొకగృహంబునకుం దగ భిక్ష చేసి రా
బోయిన వాఁడు వెంబడినె పోయి భుజించి మఠంబుఁ జేరి యా
చాయ నిజోత్తరీయపరిషక్తతృణాగ్రము గాంచిపట్టి నా
రాయణ కృష్ణయంచు గురుఁ డద్భుతమందఁగ మ్రొక్కి నెవ్వగన్.

220


క.

వెలవెలనిమోముతో మఱి, యెలుఁగొందఁగ గురునిఁ జూచి యెవ్వరి కెందుం
గలుగనికలుషము నా కిదె, గలిగె నయో యెట్టిపాపకర్ముఁడ నొక్కో.

221


క.

అని మడమలు మోపక నడిఁ, జని కపటవిచారశీలుఁ జపలాత్ముని శి
ష్యునిఁ దిరుగఁ బిల్చి మదిఁ గీ, ల్కొనినమహాద్భుతముతోడ గురుఁ డి ట్లనియెన్.

222


క.

నిను నేకలుషము వొదివెన్, జనఁ కారణ మేమి సరభసంబున నాతో
వినిపింపు మనినఁ దత్పద, వనజంబుల వ్రాలి యతికి వాఁ డిట్లనియెన్.

223


క.

గురునాథ నిన్ను భిక్షా, గరిమంబునఁ జాలఁ దృప్తుఁ గావించినభూ
సురునింటిపూరి వసనో, పరి దవిలెం దీనికంటెఁ బాపము గలదే.

224


గీ.

మగుడి నీపూరిపుడకఁ దన్మందిరమునఁ, గూర్చి క్రమ్మఱ నిష్పాతకుండ నగుచు
వచ్చి సేవింతుఁ ద్వత్పాదవనరుహముల, భక్తి నామీఁద గలదేనిఁ బనుపు మటకు.

225


క.

పావనుఁడఁ గాక యేవిధి, సేవించెద నిన్ను నోవిశేషవిధిజ్ఞా
నావుడు యతి విస్మయసం, భావితుఁడై వానిఁ జూచి పలికెం బ్రీతిన్.

226


చ.

కలుషము లేదు పూరిపుడకన్ ధనమో కనకంబొ చీరలో