పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తాలువుల న్లాలాకీ, లాలంబులు చెమ్మగింప లగ్నక్ష్వేళా
జ్వాలం దూలి శతుక్రతు, నీలతమోనీలవాల నేలం గూలెన్.

117


వ.

అట్లు విషధరవిషంబునం గ్రాఁగి కూలినకూతుం గని శోకించి నిమిషంబు నుండక.

118


చ.

ధనికులు గాన దానితలిదండ్రులు జాలెలు చించి యర్ధకాం
చనము లవారి గాఁగ వెదచల్లి వసుంధర పేరుకీర్తియుం
గని మనువారలం బరమగారుడమంత్రకులం బొరింబొరిం
గొనిచనుదేర వార లలికుంతలచెంతలఁ జేరి నేర్పునన్.

119


సీ.

కాటుపట్టున గత్తివాటులు వైచి నిర్విషమూఁది మనకున్న విసివె నొకఁడు
ఘటపూర్ణమంత్రపుష్కరధార లెత్తించి గుణము గానక రోసి గునిసె నొకఁడు
కలితంబుఁగను దోయిఁ గదియించి బ్రదికించుద్రోవ దుర్ఘటమైనఁ దొలఁగె నొకఁడు
పసరు నెన్నడునెత్తిఁ బ్రామి బెత్తమున నిట్టటు మోఁది పనికిరా కరిగె నొకఁడు


తే.

కదియఁబడియున్నదౌడలఁ గాఱు జొనిపి, పాయఁబడఁజేసి తగుపాటి పలుచనైన
యౌషధీసారములఁ బోసి యవియు లావు, సేయకుండిన నొకఁడు లజ్జించి చనియె.

120


క.

అప్పాట విషచికిత్సకు, లొప్పనివదనములతోడ నొండెవ్వరికిం
జెప్పక వచ్చిన చొప్పునఁ, దప్పక పోవుటయు నాసుదతితలిదండ్రుల్.

121


ఉ.

కాంచనపుత్రి నెత్తుకొని క్రమ్మఱిపోయి శివానివాసముం
దుంచి నమస్కరించి యడలూఱఁగ నిట్లని విన్నవించి రో
పంచముఖప్రియా పడుచుప్రాణము వచ్చిన మంటపంబుఁ గ
ట్టించెదమమ్మ నిన్నుఁ బురుడింపగలేరు గదమ్మ వేలుపుల్.

122


చ.

తరువు గదమ్మ మామనవి తావకపాదయుగంబు దేవతా
తరువు గదమ్మ యీపడుచు దక్కకపోయినఁ గన్నమాకు ను
త్తరువు గదమ్మ నీవరువుదానికి నిట్టియవస్థ వచ్చు ట
చ్చెరువు గదమ్మ మమ్ము దరిఁ జేరుపుమమ్మ త్రిలోకమాతృకా.

123


చ.

అని తనువేఁడి పాడి నెగులారక వారకయేడ్చువారలం
గని గిరిజాతజాత సుముఖత్వమున న్గడకంటిచూడ్కిఁ జూ
చిన నపు డేమి చెప్ప నటఁ జేడియ నిర్విషయౌచు నిద్రమే
ల్కనినవిధంబున న్దెలిసి కౌతుకసంపదఁ దేల్చె నాప్తులన్.

124


క.

దేవీవరమహిమంబున, జీవిత యగుపుత్రిఁ గొనుచు గృహమున కానం
దావిలలీలం జని రా, జీవేక్షణ కిడినమ్రొక్కు చెల్లించుటకున్.

125


గీ.

అల్ల నర్తకదంపతు లతులమతులఁ, బవనభుగ్భూషగృహిగృహప్రాంతమునకు