పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కావ నియుక్తులై యచటఁ గాల్కొనియున్నభటు ల్మతంగజ
గ్రావచరత్తరక్షుభయకంపితులై యటఁబోయి చచ్చె సం
జీవకుఁ డంచు నేలికకుఁ జెప్పిరి చెప్పిన నమ్మువారుగా
కావాల నెవ్వరైనఁ గపటాత్ములచిత్తముఁ జొచ్చి చూచిరే.

98


క.

భీషణవనమున నాయు, శ్శేషవిశేషమునఁ గుళ్ళి చివుకక యచ్చో
నీషద్రుజలేకమహా, ఘోషవృషంబునకు నిరవుకొని కాల్వచ్చెన్.

99


వ.

స్వచ్ఛందాహారాదిలాభంబుల హృష్టపుష్టారిగంబున నై యాశాక్వరప్రకరంబు
యమునాప్రాంతకాంతాకంరంబువంనం గ్రుమ్మరుచుండె నక్కాలంబున.

100


చ.

కరటులమేల్మదం బణంచి కర్కశవంచకధూర్తకృత్యము
ల్సెఱిచి పరోగ్రఖడ్గపటలి న్నెఱవాఁడికిఁ బాపి క్రొవ్వునం
గుఱువులునావారుకంటకులఁ గొండగపుల్సొరఁ బోలి పౌరుషం
బఱిముఱి గ్రాలఁ బింగళకుఁడ న్మృగరాజు చరించు నచ్చటన్.

101


క.

హరికి మృగరాజ్య మెవ్వరు, కరుణించిరి తనకు దాన కాదా వరకుం
జరభంజనునకు జలనిధి, కురువిక్రమవైభవునకు నొక రీవలెనే.

102


క.

ఆకంఠీరవము పిపా, సాకలుషితహృదయ మగుచు సలిలాశన్ స
త్వాక్తీర్ణంబగుకాళిం, దీకచ్ఛంబునకు ద్రుతగతిం జనుచుండెన్.

103


వ.

అప్పు డననుభూతపూర్వంబై యకాలప్రళయజలధరగర్జితంబునుంబోని యఖండసం
జీవకగర్జనంబు పరిసరధరావరదరిద్వారంబులం బ్రతిధ్వానంబులం బుట్టించిన నాక
ర్ణించి యశనిపాతకంపితంబగు నీహారాహర్యశృంగంబునుంబోలె సింగంబు వికలి
తాంతరంగంబై నిలువంబడి యిది యేమిటిది యొక్కో యిద్దిక్కున నేమియొకో
యనుచు మందగతిం జనుచుండె నంత నంతయుం గని దమనకుండు కరటకున కిట్ల
నియె.

104


ఉ.

ఈవడఁజల్లు నెండ గళ మెండ నఖండతరత్వరం బురో
భూవనదుర్గమార్గరవిపుత్రికిఁ బోయెడురాజు వెల్వెలం
బోవుమొగంబుతో నిపుడు పుల్గుఱితోఁ జనుఠేవ మెత్తఁగాఁ
బోవఁదొడంగె నేమిగతమో గతమోహయెఱుంగఁ జెప్పవే.

105


క.

అనిదంపూర్వపరాక్రమ, ధనుఁడ సుహృత్కుంజరముల దారుణమద మే
ర్చినయీతఁ డివ్విధంబునఁ, జన ననఘా యిప్పు డేమి చందమొ యనుడున్.

106


క.

కరటకుఁ డిట్లను మన కీ, తెరు వేటికి నుచితవృత్తి తెరువెఱుఁగనియ
న్నరుఁడు సెడుం భగ్నారస, తరుకీలంబూడ్చి తెగినతరుచరుభంగిన్.

107