పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గూఁతు నొండొకచందానఁ గుస్తరించి, యార్తి వారించి వలినీట యాళిపాట
పాటలాధరవదనదర్పణముఁ గడిగి, యుచితకాంచనపీఠిఁ గూర్చుండె నంత.

333


ఉ.

చిత్తము చెంగలింప జయసేనుఁడు సాఁగిలి మ్రొక్కి న న్మదో
న్మత్తవిరోధిరోధిరుచిమద్ఘనమూర్తి సుకీర్తి భక్తిమై
నెత్తి కవుంగిలించె నపు డింపెసలారఁగఁ జంద్రసేనుఁ డు
ద్యత్తరసత్యభాషణవిధానుఁడు బావకు మ్రొక్కి యిట్లనున్.

334


క.

దళితారి నీకుమారి, న్మిళితాంగవిలాస మైనమేనల్లున కీ
వలదే యిపుడని బద్ధాం, జలి యై ప్రార్థించుటయుఁ బ్రసాదోన్మఖుఁడై.

335


వ.

బ్రహ్మరాక్షసోద్యోగంబును బాంధవ్యంబునుం దలంచి సుకీర్తి వర్తమానలగ్నంబున
మిథ్యావలగ్నజయసేనులకుఁ బెండ్లిజేసెద ననియె నమ్మహోత్సవంబు వీటఁబాటిలి
ననాగతసంబంధిబాంధవంబును నాయాతశైలూషిశైలూషషంబును నాగచ్ఛదఖిలా
వనిపనికరంబును నాహూతబ్రాహ్మణజాతంబును నాబద్ధశుద్ధమాణిక్యతోరణంబును
నలంకృతవిపణిమార్గంబును నభిరచితరంగవల్లీమతల్లికంబును నారాధితనవగ్రహం
బును నఖండవాద్యమాననానాతూర్యంబును నై యమ్మహామహంబు ప్రవర్తిల్లె నా
సమయంబున.

336


ఉ.

బంగరుపీటఁ బెట్టి దడివంబిడి రాజకుమారి దానిమీఁ
దం గదియించి తూర్యనినదంబుల రోదసి ఘూర్ణిలంగ ఠీ
విం గడుపాటిపాట వరవెండ్రుకలం గొమరౌసువాసినుల్
చెంగట నక్షతంబు లిడి చేఁడియకుం దలయంటి రాదృతిన్.

337


క.

సుమతైలప్లుతి నలరా, కొమరాలికి నలరెఁ గురులు కోకనదాంత
స్సుమధూళిమగ్న మంద, భ్రమరీసమరీతి నయనపర్వము లగుచున్.

338


తే.

బుగులుకొనుతావిసిరము కప్పురముతోడ, పడుపుదివ్వనిఘుసృణద్రవంబుతోడఁ
బొందుగా మేళవించిన చందనంబు, నాఁతి కొండొకకలకంఠి నలుగుఁ బెట్టె.

339


ఉ.

అజ్జలజాక్షివస్తుసుమహన్మతిమజ్జనశాలిబాలిక
ల్మజ్జనశాలఁ జేర్చి మణిమంజులపీఠముఁ బెట్టి దువ్వి పై
గొజ్జఁగినీరుచల్లి మెఱుఁగుల్గొన విప్పి విదిర్చి యొక్కచం
చజ్జఘనాంగ పెట్టె ఘనసారయుతామలకంబు నేర్పునన్.

340


ఉ.

తోరపుజాళువాపసిఁడితొట్టుల నొట్టినపశ్చిమంబు ప
న్నీ రపరంజిబుంగలను నించి మరోహరకక్షకాంతి బం
గారువసంతమాడఁ గరకంకణఝంకృతు లుల్లసిల్ల హే
లారతి నార్చె నొక్కనవలా జలకం బలకంబుకంఠికిన్.

341