పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బెఱిఁగియుఁ జావ నేల యిపు డీ వన నబ్బహుమానుఁ డోరి ద
బృఱలకు రాకు తాఁకునెడపల్కుల కోర్చినవాఁడఁగాఁ జుమీ.

18


క.

పందకుఁ గాక పలాయన, కందళిసాహసునియందు గలుగునె యని మి
న్నందినకోపంబున వై, చెం దామ్రముఖుండు పుల్లసిల శిలనలుకన్.

19


క.

మఱియొకకుటవిటపంబునఁ, జఱచి ఘనక్రోధదృష్టి సమకొన ముష్టిన్
బఱియపడ నురముఁ బొడిచిన, మఱియుం బడ కపుడు తామ్రముఖుఁ డుగ్రుండై.

20


క.

బలవంతు మాల్యవంతుం, జలధికడం గడఁగి నొంప సమయింపంగాఁ
దలఁచుహనుమంతుఱంతున, నలవృద్ధుం గ్రుద్ధుముష్టిహతి క్షితిఁ గూల్చెన్.

21


తే.

కూల్చి చంపక యుసురుతోఁగూడ నతని, నతనికాంతాళిఁ గైకొని యతులగతులఁ
బఱచి వారాశిరాశితత్ప్రాంతకాంత, ధరఁ జిరాదృతి శైత్యకృత్యము లొనర్ప.

22


క.

కొండొకకాలమునకుఁ గపి, మండలపతి మూర్ఛఁ దేఱి మహిరహితోఁ గూ
ర్చుండి కనువిచ్చి రిపు ను, ద్దండపరాక్రమునిఁ గాంచి తలవంచుకొనెన్.

23


వ.

అగణ్యదాక్షిణ్యాభిముఖుం డగుతామ్రముఖుం డబ్బహుమాను నన్వర్థనాముఁ
గావించి పంచిన.

24


చ.

జరఠకపీంద్రుఁ డట్లరిగి సాగరతీరమునందు మానితాం
బురుహభవాండషండపరిభూషితుఁడై వెలుఁగొందుచున్నయీ
శ్వరుఁడన నుజ్జ్వలజ్జటిలసారఫలంబులఁ బూర్ణమై మహా
గరిమ వహించుదాని మధుగర్భమునాఁ జను మేడిదోఁచినన్.

25


క.

పరికించి యయ్యదుంబర, తరువెక్కి తదీయపక్వతరఫలసేవా
గరిమం బ్రాణానిలసం, భరణముఁ గావించికొనుచుఁ బ్లవఁగుం డుండెన్.

26


క.

అలకపిచేతిపచేళిమ, ఫలము ప్రమాదమున జారి పాథోధిజలం
బులఁ బడియెఁ బడిన నొండొక, బుళబుళశబ్దంబు సంప్రభూతం బయ్యెన్.

27


క.

ఆనినదము కర్ణంబుల, కానందవిధావిధాయి యగుటయు గణనా
హీనము లగుతత్ఫలముల, వానరుఁ డక్కడలినీట వైవఁగఁ దొడఁగెన్.

28


క.

వనచరకరముక్తములై, వనధింబడు మేడిపండ్ల వారణ లోలో
దినుచుఁ జలింపక క్రకచుం, డను దారుణశింశుమార మచ్చోనుండన్.

29


క.

అధికతమోదుంబరఫల, మధురరుచిం జొక్కి శింశుమారము మాసా
వధిగా నచ్చోటన కర, మధివసియించె న్నిజప్రియావిముఖంబై.

30


చ.

క్రకచునిభార్య కూర్మిచెలిఁ గన్గొని యిట్లనుఁ బ్రాణవల్లభుం
డకట యెటేనిఁబోయి తడవయ్యె విలంబనహేతు వెద్దియో